Begin typing your search above and press return to search.

లైంగికంగా వేధించింది.. న‌టిపై ఫోక్సో కేసు!

ఆమె తనను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించిందని యూట్యూబ్‌లో అతడిపై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసిందని పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   14 Oct 2024 11:30 PM GMT
లైంగికంగా వేధించింది.. న‌టిపై ఫోక్సో కేసు!
X

అలువాకు చెందిన ఓ నటి ఫిర్యాదు మేరకు నటి స్వాసికతో పాటు మరో ఇద్దరు సినీ పరిశ్రమ ప్రముఖులు బీనా ఆంటోనీ, ఆమె భర్త మనోజ్‌లపై చట్టపరమైన కేసు నమోదైంది. ఇండియాగ్లిట్జ్ తమిళ్ నివేదిక ప్రకారం ఒక యూట్యూబ్ ఛానెల్‌లో కనిపించిన సమయంలో నిందితులు చేసిన వ్యాఖ్యలు అవమానకరమైనవి, స్త్రీత్వాన్ని అవమానించేవి, మహిళల అణకువను ఉల్లంఘించేవిగా ఉన్నాయని ఫిర్యాదులో స‌ద‌రు న‌టి ఆరోపించింది. బీనా ఆంటోనీని మొదటి ముద్దాయిగా, ఆమె భర్త మనోజ్‌ని రెండో ముద్దాయిగా, స్వసికను మూడో ముద్దాయిగా పేర్కొన్నారు. ఆ మేర‌కు కేసు పూర్తి వివ‌రాల‌ను టైమ్స్ ఆఫ్ ఇండియా త‌న క‌థ‌నంలో పేర్కొంది.

మలయాళ చిత్ర పరిశ్రమలోని సమస్యలను ప్రస్తావించిన హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత స‌ద‌రు యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. హేమ క‌మిటీ నివేదిక అనంత‌రం.. వేధింపుల్లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న‌ నిందితుల్లో ఎడవెల బాబు, ముఖేష్, మణియన్‌పిల్ల రాజు, జయసూర్య, జాఫర్ ఇడుక్కి, బాలచంద్ర మీనన్ వంటి ప్రముఖులు ఉన్నారు.

సంబంధిత సంఘటనలో బాలచంద్ర మీనన్ అలువాకు చెందిన నటిపై ఫిర్యాదు చేయడం ద్వారా కౌంటర్ ఇచ్చారు. ఆమె తనను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించిందని యూట్యూబ్‌లో అతడిపై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసిందని పేర్కొన్నారు. ఇదే కాకుండా, అదనంగా ఫిర్యాదుదారు బంధువు ఆమెపై పోక్సో కేసు నమోదు చేశారు.

స్వసిక ఇటీవల 'లబ్బర్ పండు' అనే చిత్రంలో కనిపించింది. గ్రామీణ క్రికెట్ డ్రామాలో దినేష్ స‌ర‌స‌న‌ జతకట్టింది. ఆరేళ్ల తర్వాత తమిళంలో పునరాగమనం చేయడం ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి స్వాసిక ఆకట్టుకునే మంచి పాత్రను వెతికి ప‌ట్టుకుంది. నాల్గవ వారంలో 'లబ్బర్ పండు' విజయవంతంగా రన్ అవుతోంది.