Begin typing your search above and press return to search.

'రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ మృతి'... లోకేష్ ఆందోళన!

ఈ సందర్భంగా... "సైకో జగన్, చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేయించింది జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయి

By:  Tupaki Desk   |   21 Sep 2023 8:11 AM GMT
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ మృతి... లోకేష్ ఆందోళన!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ప్రాణానికి హాని ఉందంటూ గతకొన్ని రోజులుగా టీడిపీ నేతలు, బాబు కుటుంబ సభ్యులూ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ విషయంపై తాజాగా మరోసారి రియాక్ట్ అయ్యారు నారా లోకేష్. ఈ క్రమంలో "రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ మృతి" అనే ఒక వెబ్ న్యూస్ స్కీన్ షాట్ ను షేర్ చేశారు!

అవును... "రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ (19) దోపిడీ కేసులో 6 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇటీవల టైఫాయిడ్, రక్తపు వాంతులు కావడంతో చికిత్స పొందుతూ, డెంగ్యూ రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని ఈ నెల 19 అర్ధరాత్రి కాకినాడ జీజీహెచ్ చేర్చారు. ఈ మేరకు చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు."

అని ఉన్న ఒక న్యూస్ కి చెందిన న్యూస్ యాప్ స్క్రీన్ షాట్ ని నారా లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా... "సైకో జగన్, చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేయించింది జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు" అని ట్వీట్ చేశారు.

ఇదే క్రమంలో... "జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోంది.‌ బాబు గారికి జైలులో భద్రత లేదు, విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడు. బాబు గారికి ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబు గారికి ఏం జరిగినా జగన్ దే బాధ్యత" అని ట్విట్టర్ లో సంచలన ఆరోపణలు చేశారు నారా లోకేష్!