Begin typing your search above and press return to search.

నిమజ్జనం వేళ.. తెలుగు సీఎం చేయని పనిని చేసిన రేవంత్

హైదరాబాద్ మహానగర నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా పూర్తైంది.

By:  Tupaki Desk   |   18 Sep 2024 4:27 AM GMT
నిమజ్జనం వేళ.. తెలుగు సీఎం చేయని పనిని చేసిన రేవంత్
X

హైదరాబాద్ మహానగర నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా పూర్తైంది. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి తలనొప్పులు లేకుండా నిమజ్జనాన్ని అధికారులు.. పోలీసులు పూర్తి చేశారు. కత్తి మీద సాము లాంటి నిమజ్జనం టాస్క్ ప్రశాంతంగా పూర్తి అయ్యేలా చేయటంలో రేవంత్ సర్కారు పాత్ర ఉందని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వినాయక నిమజ్జనం వేళలో స్వయంగా నిమజ్జనం జరిగే చోటుకు రావటం.. కొన్ని నిమజ్జనాల్ని ప్రత్యేకంగా పర్యవేక్షించడం లాంటివి చేపట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలోకానీ.. అంతకుముందున్న ఉమ్మడి రాష్ట్రంలో కానీ మరే ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి మాదిరి వినాయక నిమజ్జనం జరిగే ప్రాంతాలకు స్వయంగా వచ్చి.. దగ్గరుండి పర్యవేక్షించడం.. లాంటివి చేయలేదన్న మాట వినిపిస్తోంది. ఇదో అరుదైన రికార్డు అని.. గతంలో మరే ముఖ్యమంత్రి చేయని పనిని సీఎం రేవంత్ పూర్తి చేయటాన్ని పలువురు హర్షిస్తున్నారు. తమది ప్రజా ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే పనిగా ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లే.. ఆయన మాటలు.. చేతలు ఉండటాన్ని హర్షిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మంగళవారం ఉదయం మొదలైన వినాయక నిమజ్జనం ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం వరకు కొనసాగే వీలుందని చెబుతున్నారు. మహా నిమజ్జనం ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ప్రత్యేకంగా 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో హుస్సేన్ సాగర్ చుట్టూ క్లీనింగ్ చేయటానికి జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. ఒక్క హుస్సేన్ సాగర్ చుట్టు పక్కల మంగళవారం రాత్రి నాటికి 1.03 లక్షల గణనాధులను నిమజ్జనం చేసినట్లుగా చెబుతున్నారు. సాగర్ తర్వాత అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546 గణనాథుల్ని నిమజ్జనం చేస్తే.. అల్వాల్ కొత్త చెరువు వద్ద 6211 వినాయక విగ్రహాల్ని నిమజ్జనాలు పూర్తి చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు.గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో 71 ప్రాంతాల్లో వినాయక నిమజ్జనాల్ని చేపట్టారు.