Begin typing your search above and press return to search.

పిక్స్‌ వైరల్‌.. విదేశాల్లో రోజా ఇలాగా!

ఇటీవల ఎన్నికల్లో రోజా ఓటమిపాలు కావడంతో ఆమె ఎక్కడా కనిపించడం లేదు.

By:  Tupaki Desk   |   6 Aug 2024 7:40 AM GMT
పిక్స్‌ వైరల్‌.. విదేశాల్లో రోజా ఇలాగా!
X

వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని కలలు కన్న ప్రముఖ సినీ నటి, వైసీపీ నేత ఆర్కే రోజా కలలు కల్లలయిన సంగతి తెలిసిందే. 2014, 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున బొటాబాటీ మెజారిటీతో గెలిచిన రోజా ఈసారి ఘోర ఓటమి పాలయ్యారు.


2019 నుంచి 2024 జూన్‌ 3 వరకు ఆర్కే రోజా చక్రం తిప్పారు. తొలి మూడేళ్లు ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) చైర్‌ పర్సన్‌ గా కేబినెట్‌ మంత్రి హోదాతో పదవిని దక్కించుకున్నారు. చివరి రెండేళ్లు పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా ఒక వెలుగు వెలిగారు.

వైసీపీలో ఫైర్‌ బ్రాండ్‌ గా పేరు తెచ్చుకున్న రోజా.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు జైలు పాలయినప్పుడు రోజా బాణసంచా కాల్చి సంబరాలు కూడా జరుపుకోవడం గమనార్హం.

ఇటీవల ఎన్నికల్లో రోజా ఓటమిపాలు కావడంతో ఆమె ఎక్కడా కనిపించడం లేదు. ఓటమి పాలయ్యాక ఒకటి రెండు ప్రెస్‌ మీట్లలో మాట్లాడటం మినహా అడ్రస్‌ లేరు. మరోవైపు ఏపీఐఐసీ చైర్‌ పర్సన్‌ గా, పర్యాటక శాఖ మంత్రిగా ఆమె అవినీతికి పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి.

మరోవైపు ఆమె గతంలో ఈటీవీలో జబర్దస్త్‌ తోపాటు పలు చానెళ్లలో వివిధ కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరించేవారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో రోజాకు టీవీ, సినీ రంగం నుంచి అవకాశాలు కూడా రావడం లేదని చెబుతున్నారు.

దీంతో ఇటు రాజకీయాలు, అటు వినోద రంగానికి దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో రోజా విదేశాల్లో విహరిస్తున్నారంటూ కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

వెస్ట్రన్‌ డ్రస్సులు ధరించి రోజా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తున్నాయి. కాగా ప్రస్తుతం రోజా కుమార్తె విదేశాల్లో విద్యనభ్యసిస్తోందని చెబుతున్నారు. ఇంగ్లండ్‌ లో రోజా కూతురు అన్షుమాలిక చదువుతోందని అంటున్నారు. ఆమెను చూడటానికి వెళ్లిన రోజా పనిలో పనిగా విదేశీ విహార యాత్రను ఎంజాయ్‌ చేస్తున్నారని సమాచారం.