Begin typing your search above and press return to search.

ముంబై లోకల్ ట్రైన్స్ లో హిందీలో రష్యన్ అమ్మాయి సందడి.. వీడియో వైరల్!

ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తమ అనుభవాలను పంచుకుంటారు. అలాంటివారిలో రష్యాకు చెందిన మరియా చుగురోవా టాప్ ప్లేస్ లో ఉండేవారిలో ఒకరు.

By:  Tupaki Desk   |   17 Aug 2024 2:30 PM GMT
ముంబై లోకల్  ట్రైన్స్  లో హిందీలో రష్యన్  అమ్మాయి సందడి.. వీడియో వైరల్!
X

భారతదేశ గొప్ప సాంస్కృతిక విధానం, విభిన్న ప్రకృతి దృశ్యాలు విదేశీయులను.. మరి ముఖ్యంగా వ్లాగర్లను ఆకర్షించడంలో నిత్యం సక్సెస్ అవుతుంటాయి. ఈ మట్టికున్న గొప్పతనం అలాంటింది. ఈ నేపథ్యంలోనే చాలామంది విదేశీయులు భారత్ లో అన్వేషించడానికి, అనుభవాలను సంపాదించుకోవడానికి వస్తుంటారు.


ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తమ అనుభవాలను పంచుకుంటారు. అలాంటివారిలో రష్యాకు చెందిన మరియా చుగురోవా టాప్ ప్లేస్ లో ఉండేవారిలో ఒకరు. ఈమె భారత్ లో తన వీడియోలతో ప్రజల హృదయాలను గెలుచుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ముంబై లోకల్ ట్రైన్ లో తన ఎక్స్ పీరియన్స్ ని వీడియో తీసి ఇన్ స్టాలో పంచుకుంది.

భారత్ లో, ప్రధానంగా హిందీ ఎక్కువగా మాట్లాడే రాష్ట్రాల్లో మరియా చుగురోవా చాలా ఫేమస్ అనే చెప్పాలి. ఇక్కడే ఉంటున్న ఆమెను చిన్నా పెద్దా అంతా గుర్తుపడుతుంటారు. ఆమె కూడా అందరితోనూ కలిసిపోతుంటారు. అందరినీ హిందీలో పలకరిస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల ఇండియన్ ఇండిపెండెన్స్ కి ఆమె చేసిన సందడి కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ముంబై లోకల్ ట్రైన్స్ లో ప్రయాణించింది. ఈ సందర్భంగా ఆమె దాదార్ కి రూ.5 పెట్టి టిక్కెట్ కొని ప్రయాణించింది. ఈ సందర్భంగా ‘వెల్ కం టు హెల్’ అని మొదలుపెట్టిన ఆమె... ‘ఒక రష్యాన్ అమ్మాయికి భారత్ లో అత్యంత రద్దీఅయిన రైలు ప్రయాణ అనుభవం’ అంటూ ముందుకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

కాగా... మరియా చుగురోవా ఇన్ స్టాగ్రామ్ పేజీతో పాటు యూట్యూబ్ ఛానల్ ని కూడా మెయిన్ టైన్ చేస్తుంది. ఈ సందర్భంగా ఆమె ప్రస్తుతం భారత్ లోని వివిధ మూలాలను అన్వేషిస్తోంది. వాటికి సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో తన అనుభవాలతో కలిపి పంచుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ఇన్ స్టాలో 3.6 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉంది.