Begin typing your search above and press return to search.

"రక్త సంబంధం లేకపోయినా"... షర్మిళ రాఖీ ట్వీటు.. నెట్టింట హాటు హాటు!

నేడు రాఖీ పౌర్ణమి కావడంతో ఆన్ లైన్ వేదికగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ శుభాకాంక్షలు చెప్పారు.

By:  Tupaki Desk   |   19 Aug 2024 11:25 AM GMT
రక్త సంబంధం లేకపోయినా... షర్మిళ రాఖీ ట్వీటు.. నెట్టింట హాటు హాటు!
X

నేడు రాఖీ పౌర్ణమి కావడంతో ఆన్ లైన్ వేదికగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సమయంలో... ‘ఈ పోస్టులో షర్మిళ రాసిన లైన్లు కొన్ని ఎవరికో తగిలినట్లు ఉన్నాయి?’ అంటూ కొంతమంది అంటుండగా.. మరికొంతమంది ఆమెకు షాకింగ్ రిప్లైలు ఇస్తున్నారు.

అవును... ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ రాఖీ శుభాకాంక్షలు చెప్పారు. వాస్తవానికి గతంలో ప్రతీ రాఖీ పండుగ నాడూ షర్మిళ తన అన్న వైఎస్ జగన్ కు రాఖీ కట్టేవారు. అయితే గత కొంతకాలంగా అది జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియా వేదికగానూ తన (సొంత) అన్నకు శుభాకాంక్షలు చెప్పలేదు. ఈ నేపథ్యంలో చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇందులో భాగంగా... తన జీవితంలోనూ, రాజకీయ ప్రస్థానంలోనూ అడుగడుగునా అండగా ఉంటూ.. "రక్త సంబంధం" లేకపోయినా, వైఎస్సార్ అనే బంధంతో తనకు తోబుట్టువుల్లగా నిలబడి, అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ప్రతీ అన్నకు, ప్రతి తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటూ షర్మిళ ట్విట్ చేశారు. దీంతో.. ఇందులోని ప్రతీ లైన్ నూ ఢీకోడ్ చేసే పనిలో ఉన్నట్లున్నారు నెటిజన్లు!

ఇదే క్రమంలో... "వెలకట్టలేని బంధాలను, వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రక్షాబంధనం.. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని నా ప్రార్థన" అంటూ ముగించారు. ఈ సందర్భంగా పోస్ట్ చేసిన ఫోటోలో రాహుల్ గాంధీ, వైఎస్సార్ తో పాటు మరికొంతమంది నేతలు ఉన్న ఫోటోను జత చేశారు. దీంతో... షర్మిళ రాఖీ స్పెషల్ విషెస్ ఇప్పుడు నెట్టింట ఫుల్ హల్ చల్ చేస్తున్నాయి.

ఈ సందర్భంగా... షర్మిళకు కొంతమంది నెటిజన్లు "థాంక్యూ సిస్టర్!" అని చెబుతుండగా... "నీకు తోడబుట్టిన రక్తసంబంధం జగన్ అన్న జ్ఞాపకం లేడా అక్క?" అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో... "రక్త సంబంధం లేకపోయినా మా అన్నకు చాలా మంది అక్కాచెల్లెళ్లు ఉన్నారులే అక్క!" అంటూ ఇంకొంతమంది స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ టాపిక్!!