Begin typing your search above and press return to search.

దారుణం... ప్రమాదంలో నలుగురు యూట్యూబర్లు దుర్మరణం!

తాజాగా జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు - బొలెరో వాహనాలు పరస్పరం ఢీకొట్టుకున్నాయి.

By:  Tupaki Desk   |   10 Jun 2024 9:18 AM GMT
దారుణం... ప్రమాదంలో నలుగురు యూట్యూబర్లు దుర్మరణం!
X

తాజాగా జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు - బొలెరో వాహనాలు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఆ కారులో కూర్చున్న నలుగురు యూట్యూబర్లు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో స్థానికంగా ఈ విషయం ఒక్కసారిగా తీవ్ర విషాదం నింపింది.

అవును... ఉత్తరప్రదేశ్ లోని అమ్రెహా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో భాగంగా ఒక కారు - బొలెరో వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో సల్మాన్, షారుక్, లక్కీ, షెహ్నవాజ్‌ అనే నలుగురు యూట్యూబర్లు మృతిచెందారు. మరోపక్క ఇదే ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు.

వివరళ్లోకి వెళ్తే... సల్మాన్, షారుక్, లక్కీ, షెహ్నవాజ్‌ అనే నలుగురు యువకులు "రౌండ్ టు వరల్డ్" పేరుతో యూట్యూబ్ ఛానల్ ను నడుపుతున్నారు. ఈ క్రమంలో వారంతా ఒక కారులో అమ్రోహాలోని హసన్‌ పూర్‌ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమం అనంతరం తిరిగి వస్తున్నారు.

ఈ సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు హసన్‌ పూర్ గజ్రౌలా రోడ్డులోని మనోటా బ్రిడ్జి సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న బొలేరో వాహనాన్ని ఢీకొట్టిందని చెబుతున్నారు. దీంతో ఆ నలుగురూ అక్కడిక్కడే మృతి చెందారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కి పంపించారు.