Begin typing your search above and press return to search.

వయసు 15... ప్రియురాలి కోసం ఫ్యామిలీని చంపేశాడు!

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ లోని కుసుమ్హి కల్యాణ్ గ్రామంలో ఓ తల్లి, తండ్రి, ఇద్దరు సోదరులు నివాసముంటున్నారు.

By:  Tupaki Desk   |   11 July 2024 9:52 AM GMT
వయసు 15... ప్రియురాలి కోసం ఫ్యామిలీని  చంపేశాడు!
X

ప్రేమ గుడ్డిది అని అంటారు.. ఈ మధ్యకాలంలో క్రైం స్టోరీలకు సోర్స్ గా మారుతుంది.. ప్రేమికులను కిరాతకంగా కూడా మారుస్తుంది! ప్రేమకు అంగీకరించడం లేదని ప్రేమించిన అమ్మాయి గొంతు కోయడం.. ఆ అమ్మాయి తల్లి తండ్రులను హత్య చేయడం పరిపాటిగా మారిన రోజులివి అన్నా అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రియుడు తన ప్రియురాలి కోసం తన ఫ్యామిలీ మొత్తాన్ని హత్య చేశాడు!

అవును... "ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం" కాదు! ప్రేమ ఎప్పటికీ మధురమే కానీ... కొంతమంది ప్రేమికులే కఠినంగా, రాక్షసులుగా మారుతున్నారు! ప్రేమ అని చెప్పుకుంటూ ఆ మైకంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ మైనర్ బాలుడు తన ప్రియురాలితో పెళ్లికి అంగీకరించడం లేదని తన ఫ్యామిలీ మొత్తాన్ని హత్య చేశాడు. దీనికి పెద్ద స్కెచ్చే వేశాడు.

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ లోని కుసుమ్హి కల్యాణ్ గ్రామంలో ఓ తల్లి, తండ్రి, ఇద్దరు సోదరులు నివాసముంటున్నారు. ఈ కుటుంబంలోని చిన్న కుమారుడు (15) ప్రేమలో పడ్డాడు. తన ప్రియురాలిని ఈ వయసులోనే పెళ్లి చేసేసుకోవాలని ఆత్ర పడ్డాడు. ఈ విషయంపై తన తల్లితండ్రులు, సోదరుడి వద్ద ప్రస్థావించాడు. అయితే... ఈ వయసులో పెళ్లి ఏమిటని వారు మందలించారు.

దీంతో.. ఆ రోజు నుంచీ వారందరినీ కడతేర్చాలని ఆ బాలుడు నిర్ణయించేసుకున్నాడు. దీనికోసం ప్రతీరోజు వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్టుకు పదును పెడుతూ హత్యలు చేయడానికి గల అనువైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలో ఓ రోజు తన అన్నయ్యతో కలిసి మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి వెళ్లాలని ప్లాన్ చేశాడు. అనుకున్నట్లుగానే అన్నదమ్ములిద్దరూ మ్యూజికల్ నైట్ కి వెళ్లి వచ్చారు.

అనంతరం తన అన్న, తల్లితండ్రులతో కలిసి భోజనం చేసి నిద్రపోయాడు. దీంతో మద్యం సేవించి మత్తులో ఉన్న ఆ 15 ఏళ్ల బాలుడు ఇదే సరైన సమయం అనుకున్నాడు. ఇంతకు మించి మంచి అవకాశం రాదనుకున్నట్లున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ మద్యం మత్తులో పెద్ద స్కెచ్చే వేశాడు. ఇందులో భాగంగా... అర్ధరాత్రి వరకూ వేచి చూశాడు. ఈ లోపు అర్ధరాత్రి దాటింది.

సరిగ్గా ఆ సమయంలో తన తండ్రి మునీష్ బింద్ (45), తల్లి దేవంతి బింద్ (40), సోదరుడు రాం ఆసిష్ బింద్ (20) లను ఈ 15 ఏళ్ల బాలుడు అర్ధరాత్రి దాటిన తర్వాత వ్యవసాయం చేసే ఆ పని ముట్టుతో గొంతులు కోసేశాడు. ఈ సమయంలో... తీవ్ర రక్తస్రావంతో ముగ్గురు కుటుంబ సభ్యులూ ఇంట్లోనే మృతిచెందారు. బాలుడు అక్కడ నుంచి పరారయ్యాడు.

దీంతో... మరుసటి రోజు బంధువులు, గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో... సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆ బాలుడి కోసం గాలించిన పోలీసులు అతన్ని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ హత్యలకు గల కారణం విని గ్రామస్థులు, బంధువులు షాక్ అవ్వగా... కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.