Begin typing your search above and press return to search.

డబ్బుల కోసం వధూవరులుగా మారిన అన్నాచెల్లెళ్లు!

అవును... ఉత్తరప్రదేశ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకాన్ని ఉపయోగించుకోవడానికి అన్నాచెల్లెళ్లు వివాహం చేసుకున్నారనే ఘటన తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   8 Oct 2024 3:45 AM GMT
డబ్బుల కోసం వధూవరులుగా మారిన అన్నాచెల్లెళ్లు!
X

డబ్బు మనిషితో ఎంతటిపనైనా చేయిస్తుందని అంటుంటారు. తాజాగా ఆ మాటకు బలం చేకూర్చే ఘటన ఒకటి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా డబ్బుల కోసం ఓ యువకుడు తన సొంత చెల్లిని వివాహం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

అవును... ఉత్తరప్రదేశ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకాన్ని ఉపయోగించుకోవడానికి అన్నాచెల్లెళ్లు వివాహం చేసుకున్నారనే ఘటన తెరపైకి వచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులకు మద్దతు ఇవ్వడం కోసం రూపొందించిన ఈ పథకం ఈ స్థాయిలో దుర్వినియోగం అవుతుందా అనే చర్చకు బలం చేకూర్చింది.

దీంతో... ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం మోసగాళ్లకు అడ్డాగా మారిందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ పథకం కింద వివాహిత జంటలకు గృహోపకరణాలు, రూ.35,000 నగదు మంజూరు చేస్తారు. అయితే మహారాజ్ గంజ్ లోని లక్ష్మీపూర్ బ్లాక్ లో జరిగిన ఈ ఉదంతం దోపిడీ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుందని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... మార్చి 5న 38 జంటలు ప్రభుత్వ సామూహిక వివాహ కార్యక్రమం ద్వారా ఏకమయ్యాయి. ఈ సమయంలో ఈ పథకం ప్రయోజనాలు క్లెయిం చేయడానికి ఒక సంవత్సరం ముందే వివాహం చేసుకున్న మహిళను మళ్లీ వేడుకలో పాల్గొనమని ఒప్పించారు మధ్యవర్తులు.

ఈ సమయంలో ఆమెకు ఉద్దేశించిన వరుడు కనిపించకపోవడంతో.. ఆశ్చర్యకరంగా అతని స్థానంలో ఆ మహిళ సోదరుడిని ఒప్పించారు. అయితే ఈ మోసానికి సంబంధించిన వార్త అధికారులకు తెలిసింది. దీంతో... అధికారులు వేగంగా చర్యలకు ఉపక్రమించారు.

ఇందులో భాగంగా... పెళ్లి సమయంలో ప్రభుత్వం అందింఛిన వస్తువులు, ఆర్థిక సహాయాన్ని తిరిగి పొందేందుకు లక్ష్మీపూర్ బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఆ మహిళ ఇంటికి అధికారులను పంపించారు. ఈ అక్రమం వెలుగులోకి వచ్చిన తర్వాత వారికి ఇచ్చిన అన్ని ప్రయోజనాలనూ జప్తూ చేశారని అంటున్నారు.