Begin typing your search above and press return to search.

తెలంగాణలో మానవమృగం దాడి... ఆరేళ్ల బాలిక మృతి!

అవును... తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గురువారం రాత్రి ఘోరం జరిగిపోయింది.

By:  Tupaki Desk   |   14 Jun 2024 10:16 AM GMT
తెలంగాణలో మానవమృగం దాడి... ఆరేళ్ల  బాలిక మృతి!
X

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దారుణమైన, ఘోరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఒక మానవ మృగం! అనంతరం ఆ బాలికను హత్య చేశాడు! చేతులతో ఎత్తుకుని వెళ్లిమరీ ఈ దారుణానికి ఒడిగట్టాడు.. ఈ మేరకు సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయని చెబుతున్నారు.

అవును... తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గురువారం రాత్రి ఘోరం జరిగిపోయింది. ఇందులో భాగంగా రైస్ మిల్లు వద్ద తన తల్లితో పాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు ఓ దుండగుడు. ఈ సందర్భంగా ఆమెను చేతులతో ఎత్తుకుని వెళ్లి సమీపంలోని పొదల్లో అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను హత్య చేశాడు.

అయితే... అర్థరాత్రి వేళ తన కూతురు పక్కన లేదని గుర్తించిన తల్లి ఆందోళన పడింది. ఈ సమయంలో ఇతర కార్మికులకు విషయం చెప్పింది. దీంతో వారంతా ఆ రైస్ మిల్లు సమీపంలో వెతకడం ప్రారంభించారు. అ సమీపంలోని పొదల్లో బాలిక శవమై కనిపించడాన్ని గుర్తించారు. అనంతరం నిందితుడిని గుర్తించిన కార్మికులు.. అతడిని పోలీసులకు అప్పగించారు.

నిందితుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన ట్రక్ డ్రైవర్ అని చెబుతున్నారు. రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ సమయంలో బాలిక మృతదేహాన్ని శవపరీక్షకు పంపిన పోలీసులు విచారణ చేపట్టారు.