Begin typing your search above and press return to search.

గుండు గీయించుకుంటానంటున్న ఆప్ నేత !

‘‘నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే నేను గుండు గీయించుకుంటాను. నా మాటలను గుర్తుపెట్టుకోండి

By:  Tupaki Desk   |   2 Jun 2024 5:25 AM GMT
గుండు గీయించుకుంటానంటున్న ఆప్ నేత !
X

లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముచ్చటగా మూడోసారి పీఠం ఎక్కబోతున్నారని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈసారి బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎ ఎట్టి పరిస్థితులలో అధికారంలోకి రాదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమ్ నాథ్ భారతి సవాల్ విసురుతున్నాడు. మోడీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు గీయించుకుంటానని ప్రతినబూనాడు.

‘‘నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే నేను గుండు గీయించుకుంటాను. నా మాటలను గుర్తుపెట్టుకోండి. శనివారం వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పు అని జూన్ 4న రుజువవుతుంది. మోడీ తిరిగి ప్రధాని కాలేరు. ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలను ఇండియా కూటమి గెలుచుకుంటుంది. ఎగ్జిట్ పోల్స్‌కు మోదీ భయం ఉంది. అందుకే ఆయన ఓడిపోతారని చెప్పలేదు. ఓటర్లు మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు’’ అని ఆయన అంటున్నారు.

‘‘ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ కార్యాలయంలో తయారు చేశారు. తమిళనాడులో బీజేపీకి 34 శాతం ఓట్లు వస్తాయంటే ఎవరైనా నమ్ముతారా ? పంజాబ్‌లో ఆప్‌కి ఒక్క సీటు రాదంటే ఎలా నమ్మాలి ? ఇండియా కూటమి నేతలు పంచుకున్న ‘జనతా కా ఎగ్జిట్ పోల్’ ప్రకారం తమ కూటమి 295కిపైగా స్థానాలను గెలుస్తుంది’’ మరో ఆప్ నేత సంజయ్ సింగ్ అంటున్నారు.