Begin typing your search above and press return to search.

ఎగ్జిట్ పోల్స్ ని పరిపూర్ణం చేసిన స్వామి

కొద్ది గంటలే సమయం ఉంది అసలు ఫలితం రావడానికి అంతా జూన్ 1 సాయంత్రమే ఎగ్జిట్ ఫలితాలు ప్రకటించేశారు

By:  Tupaki Desk   |   3 Jun 2024 3:08 PM GMT
ఎగ్జిట్ పోల్స్ ని పరిపూర్ణం చేసిన స్వామి
X

కొద్ది గంటలే సమయం ఉంది అసలు ఫలితం రావడానికి అంతా జూన్ 1 సాయంత్రమే ఎగ్జిట్ ఫలితాలు ప్రకటించేశారు. ఇంకా కొంతమంది మరుసటి రోజు వివరాలు అంటూ ఇంకా మిగిలినవి చెప్పాల్సింది చెప్పేశారు. కౌంటింగ్ కి కౌంట్ డౌన్ అవుతున్న వేళ ఎగ్జాక్ట్ పోల్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామీజీ తనదైన సర్వే లాంటి విశ్లేషణ వెల్లడించారు.

ఆయన చెప్పిన దాంతో 2024 ఎన్నికలకు సంబంధించి సర్వేలు పరిపూర్ణం అయ్యాయని అంటున్నారు. ఒక విధంగా ఆయన చెప్పిన ఈ సర్వేయే ఆఖరు కావచ్చు. ఎందుకంటే ఇక సర్వేలు చెప్పేందుకు టైం కూడా లేదు కాబట్టి అని అంటున్నారు.

మరి పరిపూర్ణానంద స్వామి చెప్పింది ఏంటి అన్నది చూస్తే కొంత ఆసక్తిగానే ఉంది. ఆయన కాషాయ పార్టీకి ఓటేస్తూనే ఏపీలో మాత్రం జగన్ దే ప్రభుత్వం అని సంచలన సర్వేనే బయటపెట్టారు. అంతే కాదు ఆరా మస్తాన్ భయపడుతూ మొహమాటపడుతూనే వైసీపీకి 94 నుంచి 104 అంటూ సర్వే ఫలితాలు ఇచ్చారు కానీ తనకు ఉన్న సర్వే నివేదికలు అంచనాలు చూస్తే ఆ నంబర్ 123 దాకా వెళ్తుందని స్వామి చెప్పుకొచ్చారు.

ఆయన చెప్పిన కారణాలు చూస్తే గ్రామీణ ప్రాంతాలలో భారీ ఓటింగ్ జరిగిందని అదంతా వైసీపీ అనుకూల ఓటింగ్ అని అంటున్నారు. అంతే కాదు మహిళలు పూర్తి స్థాయిలో వైసీపీకి ఓటు చేశారు అని ఆయన వెల్లడించారు. ఇక హిందూపురంలో కూడా ఆయన ఒక విశ్లేషణ వినిపించారు. రూరల్ లో లక్ష దాకా ఓట్లు ఉంటే అందులో అత్యధికం వైసీపీకి వస్తున్నాయి. పట్టణంలో కూడా భారీగా ఓటింగ్ జరిగిందని కానీ అక్కడ ఓట్లు కొంచెం తక్కువ అని అన్నారు.

మొత్తానికి హిందూపురంలో బాలకృష్ణకి టైట్ ఫైట్ అని స్వామి అంటున్నారు స్వామి హిందూపురంలో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఇక దేశంలో చూస్తే మోడీకి బీజేపీకి ఏ ఇబ్బంది లేదని ఈసారి కూడా బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని సొంతంగానే మోడీ ప్రభుత్వాన్ని స్థాపిస్తారు అని స్వామి జోస్యం చెప్పారు.

ఇక ఈ సర్వేల వివరాలు తనకు అతి ముఖ్యమైన వ్యక్తి నుంచి వచ్చాయని ఆయన చెబుతున్నారు. ఆ అతి ముఖ్యమైన వ్యక్ర్తి ఎవరు దేశంలో పవర్ ఫుల్ పార్టీలోని వారా అన్న చర్చ నడుస్తోంది. పరిపూర్ణానంద స్వామికి జాతీయ స్థాయిలో పెద్ద వ్యక్తులతో మంచి పరిచయాలు ఉన్నాయి. మరి ఆయన చెప్పిన విషయాలు తీసుకుంటే ఆ వ్యక్తి ఎవరు అన్నదే చర్చకు తావిస్తోంది. పరిపూర్ణానంద అంచనాలు ఏ మేరకు కరెక్ట్ అన్నది జూన్ 4న కౌంటింగ్ లోనే తేలనున్నాయని అంటున్నారు.