Begin typing your search above and press return to search.

“వైసీపీ నిండా వీళ్లే ఉన్నారా?”... జగన్ ని తగులుకున్న టీడీపీ!

ఈ నేపథ్యంలో తన భార్య, పిల్లలపై దాడికి ప్రయత్నించినట్లున్న దువ్వాడ శ్రీనివాస్ వీడియోలు, ఫోటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ టీడీపీ తగులుకుంది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

By:  Tupaki Desk   |   10 Aug 2024 7:27 AM GMT
“వైసీపీ నిండా వీళ్లే ఉన్నారా?”... జగన్  ని తగులుకున్న టీడీపీ!
X

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహరం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన భార్య వాణి, తన కుమార్తెలు.. శ్రీనివాస్ ఉంటున్న నివాసం దగ్గరకు చేరుకున్నారు. ఈ సమయంలో వారిపై శ్రీనివాస్ దాడికి ప్రయత్నించడం, అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో మేటర్ మరింత సీరియస్ గా మారిందని అంటున్నారు.

దువ్వాడ శ్రీనివాస్ దాడికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకోవడం.. వాణి, కుమార్తెలకు వలయంలా నిలబడటంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అంటున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో తన భార్య, పిల్లలపై దాడికి ప్రయత్నించినట్లున్న దువ్వాడ శ్రీనివాస్ వీడియోలు, ఫోటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ టీడీపీ తగులుకుంది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై టీడీపీ ఎక్స్ వేదికగా స్పందించింది. ఇందులో భాగంగా... “పార్టీ నిండా రౌడీలు, ఖూనీకోరులు, డెకాయిట్లు, సైకోలు, కామాంధులను పెట్టుకుని సేవ్ డెమోక్రసీ అంటున్న నిన్ను ఏమనాలి జగన్” అని అడుగుతూ.. “అసలు నీది ఓ రాజకీయ పార్టీయేనా” అని ప్రశ్నించింది. ఈ సమయంలో తన భార్య పిల్లలపైకి ఒక్క ఉదుటున దూకుతున్న దువ్వాడ ఫోటోలు పోస్ట్ చేసింది.

ఇదే సమయంలో... ఎన్నికల ప్రచార సమయంలో దువ్వాడను ప్రజలకు పరిచయం చేసిన సిద్ధం సభలో జగన్ చేసిన ప్రసంగాన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టింది. ఈ సందర్భంగా నాడు జగన్... "మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీను నిలబడతా ఉన్నాడు.. మంచి చేసి చూపిస్తాడు.. శ్రీనుతో మంచి నేను చేయిస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను" అన్నారు. దీంతో... రాత్రి జరిగిన వీడియోను పోస్ట్ చేస్తూ ట్రోల్ స్టార్ట్ చేసింది టీడీపీ.