Begin typing your search above and press return to search.

తాడిపత్రిలో తెలుగుదేశం కార్యకర్త దారుణ హత్య!

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో ఈ దారుణం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   18 Jun 2024 5:36 AM GMT
తాడిపత్రిలో తెలుగుదేశం కార్యకర్త దారుణ హత్య!
X

అధికార పార్టీకి చెందిన కార్యకర్త.. అందునా పార్టీలో దూకుడుగా వ్యవహరిస్తారన్న పేరున్న కిందిస్థాయి కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు.. అతడి ఇంటి డాబా మీద నిద్ర పోతున్న వేళ.. హత్య చేసిన వైనం సంచలనంగా మారింది. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో ఈ దారుణం చోటు చేసుకుంది.

తాడిపత్రిలోని నందలపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త 23 ఏళ్ల లాల్ బాషాను గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. మెకానిక్ గా పని చేసే అతడు.. స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి డిన్నర్ కు వెళ్లి పార్టీ చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన అతడు డాబా మీద నిద్ర పోయాడు. తెల్లారేసరికి రక్తపు మడుగులో దారుణంగా హత్య చేసిన విషయాన్ని గుర్తించారు.

విచక్షణారహితంగా దాడి చేయటంతో ఘటనాస్థలంలోనే అతను ప్రాణాలు విడిచారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ హత్య తెల్లవారుజామున జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఉదయం ఎంతసేపటికి డాబా మీద నుంచి కిందకు రాకపోవటంతో అతడి తల్లిదండ్రులు పైకి వెళ్లి చూశారు. రక్తపు మడుగులో ఉన్న కొడుకును చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. డాగ్ స్క్వాడ్ తో వెళ్లిన పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి.. విచారణ చేపట్టారు. హత్యకు కారణం తెలియాల్సి ఉందని.. కత్తులతో దారుణంగా నరికి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల్ని త్వరలో పట్టుకుంటామని చెబుతున్నారు.