Begin typing your search above and press return to search.

డల్లాస్ లో గుండెపోటుతో తెలుగు యువకుడు మృతి!

ఇదే క్రమంలో తాజాగా చిలుకూరి శ్రీరాఘవ దొర (24) అనే యువకుడు అమెరికా వెళ్లి ఉన్నత చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా సోమవారం ఉదయం గుండేపోటుతో మృతి చెందాడు.

By:  Tupaki Desk   |   24 Sep 2024 4:18 AM GMT
డల్లాస్  లో గుండెపోటుతో తెలుగు యువకుడు మృతి!
X

ఇటీవల కాలంలో వివిధ కారణాలతో విదేశాల్లో మృతిచెందుతున్న భారతీయ యువత సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. సరాసరిన నెలలో కనీసం ఇద్దరు ముగ్గురు వివిద రకాల ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని అంటున్నారు. పైగా ఎంఎస్ చదువుతున్న యువత గుండె పోటుకు గురై మృతిచెందుతున్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

అవును... కారణాలు ఏమైనా, కారకులు ఎవరైనా... రకరకాలా ప్రమాదాల వల్ల విదేశాల్లో మరణిస్తున్న భారతీయ యువత సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ ఆందోళన కలిగిస్తుంది. సరిగ్గా నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాకు చెండిన విద్యార్థి ముత్తిన రమేష్ అమెరికాలో ఎమ్మెస్ చదువుతూ హార్ట్ అటాక్ తో మృతి చెందాడు.

ఇదే క్రమంలో తాజాగా చిలుకూరి శ్రీరాఘవ దొర (24) అనే యువకుడు అమెరికా వెళ్లి ఉన్నత చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా సోమవారం ఉదయం గుండేపోటుతో మృతి చెందాడు. పెరవలి మండలం కానూరు గ్రామానికి చెందిన శ్రీరాఘవ... అమెరికాలోని డల్లాస్ లో ఎమ్మెస్ పూర్తి చేసుకుని, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు.

ఈ విషయాన్ని అక్కడివారు అతడి కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే... మృతుడికి తండ్రి లేకపోవడంతో తాతయ్య, నడుపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ ఈడ్పుగంటి దొరయ్య సంరక్షణలో పెరిగాడు! ఈ నేపథ్యంలో ఈ విషాద ఘటన గురించి తెలిసిన అనంతరం దొరయ్య స్పందించారు. ఉన్నత చదువు చదివి జీవితంలో ఉన్నతంగా స్థిరపడే సమయంలో ఈ ఘటన జరిగిందని వాపోయారు!