Begin typing your search above and press return to search.

టీడీపీ తాజా పరిస్థితికి అసలు కారణం... అంబటి విశ్లేషణ!

“టీడీపీలో కూడా అక్కడక్కడా మంచోళ్లు ఉన్నారు, కాదనడం లేదు” అని మొదలుపెట్టిన అంబటి రాంబాబు... వారిని ఉద్దేశించి... "మీ పార్టీ ఇవాళ సర్వనాశనం కావడానికి ప్రధాన కారణం నారా లోకేష్ బాబు" అని అన్నారు.

By:  Tupaki Desk   |   11 Oct 2023 7:45 AM GMT
టీడీపీ తాజా పరిస్థితికి అసలు కారణం... అంబటి  విశ్లేషణ!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నప్పటినుంచీ నారా లోకేష్, పవన్ కల్యాణ్, టీడీపీ నేతలను విపరీతంగా వెంటాడుతున్న వైసీపీ నేతల్లో అంబటి రాంబాబు ఒకరని చెప్పుకున్నా అతిశయోక్తి కాదేమో. ఆ స్థాయిలో అంబటి రియాక్షన్ ఉంటుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా అంబటి రాంబాబు టీడీపీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... “టీడీపీలో కూడా అక్కడక్కడా మంచోళ్లు ఉన్నారు, కాదనడం లేదు” అని మొదలుపెట్టిన అంబటి రాంబాబు... వారిని ఉద్దేశించి... "మీ పార్టీ ఇవాళ సర్వనాశనం కావడానికి ప్రధాన కారణం నారా లోకేష్ బాబు" అని అన్నారు. “పచ్చగా ఉన్న టీడీపీలో లోకేష్ కాలు పెట్టినా తర్వాత మల మల మాడి మసైపోతుంది” అని తెలిపారు. కారణం ఏమిటంటే... “లోకేష్ బాబు కాలు పెట్టడమే” అని అంబటి క్లారిటీ ఇచ్చారు.

ఇదే సమయంలో ఎమ్మెల్యేగా గెలవకుండా, పంచాయతీలో గెలవకుండా... నేరుగా వచ్చి మంత్రి అయిపోయారని, మంత్రివర్గంలో దూరారని, కోటాను కోట్లు మెక్కేశారని అన్నారు. ఆయన కాళ్లు పెట్టిన తర్వాతే టీడీపీ సర్వనాశనం అయిపోయే పరిస్థితి వచ్చిందనే విషయం ఇప్పటికైనా గమనించాలని అంబటి రాంబాబు ఈ సందర్భంగా టీడీపీలో ఉన్న మంచోళ్లని కోరారు!

కేవలం వెనకా ముందూ చూడకుండా వాగడం వల్లే నేడు చంద్రబాబుకు ఈ పరిస్థితి వచ్చిందని, ఆ విషయం లోకేష్ గుర్తుంచుకోవాలన్నట్లుగా మాట్లాడిన అంబటి రాంబాబు... గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్థావించారు. ఇందులో భాగంగా... గతంలో వైఎస్సార్ తనపై కేసులు పెట్టినా ఏమీ చేయలేకపోయారని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి తనను ఏమి పీకుతాడు అని చంద్రబాబు అన్నారని... రెండు పీకి సెంట్రల్ జైల్లో పెట్టాడని తెలిపారు. ఇదే విషయాలను లోకేష్ కూడా గుర్తు పెట్టుకోవాలని అన్నారు. చంద్రబాబు అరెస్టైతే చాలా మంది చనిపోయారని టీడీపీ అనుకూల పత్రికల్లో రాస్తుంటే... లోకేష్ మాత్రం ఢిల్లీలో ఉంటున్నారని అంబటి చెప్పుకొచ్చారు.

నిజంగా చంద్రబాబు అరెస్ట్ వార్త విని అంతమంది చనిపోతే వారి కుటుంబాలను పరామర్శించాల్సింది పోయి... డైపర్ తడుపుకుంటూ ఢిల్లీ ఎందుకు పోయారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా... టీడీపీకి ఇంకా తోకలో ఏమైనా ప్రాణం ఉంటే అది కూడా పోగొట్టే పనిలో లోకేష్ ఉన్నాడనే విషయం ఆ పార్టీ శ్రేణులు గుర్తించాలని అంబటి సూచించారు.

ఈ సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైల్ బయట... టీడీపీకి తన మద్దతు ఉంటుందని తెలిపిన పవన్ కల్యాణ్... వారాహి తాజా యాత్రలో మాత్రం టీడీపీ పని అయిపోయింది అని అంటున్నారని గుర్తు చేశారు. టీడీపీకి ఇంకా 23 సీట్లయినా వచ్చాయి.. వారి పనే అయిపోయిందంటే... అంటూ అంబటి తనదైన శైలిలో స్పందించారు.