Begin typing your search above and press return to search.

వాయిదాపడ్డ రాజముద్ర !

ఈ కారణంగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా అనేక వివాదాలు రేగుతున్న నేపథ్యంలో కేవలం తెలంగాణ గీతం ఆవిష్కరణకు మాత్రమే పరిమితం అవుతున్నది.

By:  Tupaki Desk   |   30 May 2024 11:30 PM GMT
వాయిదాపడ్డ రాజముద్ర !
X

తెలంగాణ రాష్ట్ర చిహ్నం కొత్త రాజముద్ర ఆవిష్కరణను కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేసింది. తెలంగాణ తల్లి, కొత్త చిహ్నం విడుదల ఆవిష్కరణ విషయంలో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ కారణంగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా అనేక వివాదాలు రేగుతున్న నేపథ్యంలో కేవలం తెలంగాణ గీతం ఆవిష్కరణకు మాత్రమే పరిమితం అవుతున్నది.

అధికార చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై ఇంకా స్పష్టత రాలేదని, 200 వరకు సూచనలు రావడంతో మరిన్ని చర్చలు జరపాలని నిర్ణయించామని, చర్చల తర్వాత అధికార చిహ్నం ఖరారు చేస్తామని చెబుతున్నది.

తెలంగాణ రాష్ట్ర గీతం, చిహ్నం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్నిరోజులుగా ప్రముఖులతో చర్చలు జరుపుతున్నాడు. అయితే రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్‌ను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. కేంద్రం ఆమోదం, గెజిట్ లేకుండా దానిని విడుదల చేయడం సాధ్యం కాదని, దానిపై కోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు తెలుస్తున్నది.