Begin typing your search above and press return to search.

ఓడిన కేంద్రమంత్రులు ఎవరో తెలుసా ?

లోక్ సభ ఎన్నికల్లో అనేక మంది ప్రముఖులు ఓడిపోయారు. వారిలో కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు

By:  Tupaki Desk   |   5 Jun 2024 1:30 PM GMT
ఓడిన కేంద్రమంత్రులు ఎవరో తెలుసా ?
X

లోక్ సభ ఎన్నికల్లో అనేక మంది ప్రముఖులు ఓడిపోయారు. వారిలో కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, అర్జున్ ముండా, అజ‌య్ మిశ్రా తేనీలు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు.

అమేథీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప‌రాజ‌యం పాల‌య్యారు. 2019లో ఇదే స్థానం నుంచి రాహుల్ గాంధీపై విజ‌యం సాధించిన ఆమె ఈసారి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి కిశోరీ లాల్ శ‌ర్మ 1,67,196 ఓట్ మెజారిటీతో ఆమెపై గెలుపొందారు.

కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రిగా చేసిన అజ‌య్ మిశ్రా తేని కూడా ఓడిపోయారు. ల‌కింపుర్ ఖేరి ఘ‌ట‌న వివాదంలో ఆయ‌న ఇరుక్కున్నారు. స‌మాజ్‌వాదీ పార్టీ అభ్య‌ర్థి ఉత్క‌ర్ష్ వ‌ర్మ చేతిలో ఆయ‌న 34 వేల ఓట్ల తేడాతో ఓట‌మిపాల‌య్యారు.

గిరిజ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రి అర్జున్ ముండా దారుణ ఓట‌మి చ‌విచూశారు. జార్ఖండ్‌లోని కుంటి నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కాళీచ‌ర‌ణ్ ముండా చేతిలో ఏకంగా 1,49,675 ఓట్ల తేడాతో ఓట‌మి పాల‌య్యారు.

వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ‌శాఖ స‌హాయ మంత్రి కైలాశ్ చౌద‌రీ రాజ‌స్తాన్‌లోని బార్మ‌ర్ నుంచి ఓడిపోయారు. ఆయ‌న ఆ స్థానంలో మూడ‌వ స్థానానికి పరిమితం అయ్యాడు. కాంగ్రెస్ అభ్య‌ర్థి ఉమ్మెడ రామ్ బెనివాల్ 4.48 ల‌క్ష‌ల ఓట్ల తేడాతో కైలాశ్‌పై గెలిచారు.

కేర‌ళ‌లోని తిరువనంత‌పురం నుంచి పోటీ చేసిన ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీశాఖ స‌హాయ మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ ఓట‌మి పాల‌య్యారు. కాంగ్రెస్ దిగ్గ‌జ నేత శ‌శిథ‌రూర్‌.. చేతిలో 16వేల ఓట్ల తేడాతో రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ ప‌రాజ‌యం చెందారు.

భారీ ప‌రిశ్ర‌మ‌ల మంత్రి మ‌హేంద్ర నాథ్ పాండే యూపీలోని చండౌలీ సీటు నుంచి ఓట‌మి పాల‌య్యారు. హౌజింగ్‌, అర్బ‌న్ అఫైర్స్ శాఖ మంత్రి కౌశ‌ల్ కిషోర్

మోహ‌న్‌లాల్‌గంజ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స‌మాజ్‌వాదీ నేత ఆర్కే చౌద‌రి ఈయనపై 70వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.

క‌న్జ్యూమ‌ర్ అఫైర్స్‌, ఫుడ్‌, ప‌బ్లిక్ డిస్ట్రిబ్యూష‌న్ శాఖ స‌హాయ మంత్రి సాధ్వీ నిరంజ‌న్ జ్యోతి యూపీలోని ఫ‌తేపుర్ నియోజ‌క‌వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రైల్వేశాక స‌హాయ మంత్రి రావు సాహెబ్ దాన్వే .. మ‌హారాష్ట్ర‌లోని జాల్నా సీటు నుంచి ఓట‌మి చెందారు. క్యాబినెట్ మంత్రి ఆర్కే సింగ్‌.. బీహార్‌లోని ఆరా సీటు నుంచి ఓట‌మి పాల‌య్యారు.

కేంద్ర మంత్రి సంజీవ్ బాల్య‌న్‌.. ముజాఫ‌ర్‌న‌గ‌ర్ లోక్‌స‌భ సీటు నుంచి ఓడిపోయారు. అక్క‌డ ఎస్పీ నేత హ‌రీంద్ర సింగ్ మాలిక్ 24 వేల ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. విదేశాంగ శాఖ‌, పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ మంత్రి వీ ముర‌ళీధ‌ర‌న్ కూడా ఓడిపోయారు. ఫిష‌రీస్‌, యానియ‌ల్ హ‌జ్‌బెండ‌రీ, డెయిరీ శాఖ స‌హాయ మంత్రి ఎల్ మురుగ‌న్ కూడా ఓట‌మి పాల‌య్యారు. డీఎంకే నేత ఏ రాజా చేతిలో ఆయ‌న రెండు ల‌క్ష‌ల ఓట్ల తేడాతో ఓట‌మి చ‌విచూశారు.

హోంశాఖ స‌హాయ మంత్రి నిషిత్ ప్రామానిక్‌.. బెంగాల్‌లోని కూచ్ బిహార్ నుంచి ఓడిపోయారు. అక్క‌డ టీఎంసీ నేత జ‌గ‌దీశ్ చంద్ర బాసునియా 39వేల ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. విద్యాశాఖ స‌హాయ మంత్రి సుభాష్ స‌ర్కార్‌.. బంకురా లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఓడిపోయారు. టీఎంసీ నేత అరూప్ చ‌క్ర‌వ‌ర్తి 32 వేల ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు.