Begin typing your search above and press return to search.

అక్రమ సంబంధాలపై సాయిరెడ్డి తాజా రియాక్షన్ ఇదే!

ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.

By:  Tupaki Desk   |   20 July 2024 6:59 AM GMT
అక్రమ సంబంధాలపై సాయిరెడ్డి తాజా రియాక్షన్  ఇదే!
X

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి.. విజయసాయిరెడ్డితో అక్రమ సంబంధం ఉందని.. ఆమె (మాజీ) భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై శాంతితో పాటు విజయసాయిరెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. మరోపక్క శాంతి భర్త మదన్ మోహన్ వరుసగా ప్రెస్ మీట్ లు పెడుతూ డీ.ఎన్.ఏ. టెస్ట్ డిమాండ్ తెరపైకి తెచ్చారు.

ఇందులో భాగంగా... విజయసాయిరెడ్డి డీ.ఎన్.ఏ. టెస్ట్ కు రావాల్సిందే అని, ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలియాల్సిందే అని.. సాయిరెడ్డిది తప్పులేదని తెలిస్తే అందరిముందూ సాష్టాంగ నమస్కారం చేసి, క్షమాపణలు చెబుతానని మదన్ మోహన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.

అవును... విజయసాయిరెడ్డి - శాంతి – మదన్ మోహన్ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి మరోసారి స్పందించారు. ఇందులో భాగంగా... అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చలామణి అవుతున్న కొన్ని సక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.

కానీ... ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం మాత్రం ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే.. శాంతి కళింగిరిని 2020 సంవత్సరంలో ఏసీ ఎండోమెంట్స్ అధికారిగా వైజాగ్ సీతమ్మధార ఆఫీసులో మొట్టమొదటగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకూ కూతురుగానే భావించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఇదే సమయంలో ఓ తండ్రిలాగానే ఆమెకు ఏ సహాయం కావాలన్నా చేసినట్లు చెప్పారు.

ఈ క్రమంలోనే ఆమెకు కొడుకు పుట్టాడని చెబితే వెళ్లి పరామర్శించినట్లు.. తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించినట్లు తెలిపారు. ఈ సమయంలోనే... తనకు ఏ పరాయి మహిళతోనూ అనైతిక / అక్రమ సంబంధాలు లేవని చెప్పిన విజయసాయిరెడ్డి.. తాను నమ్మిన దేవదేవులు శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా చెప్తానని స్పష్టం చేశారు.