Begin typing your search above and press return to search.

సాయిరెడ్డి కొత్త ఛానెల్... తెరపైకి కీలక అప్ డేట్!?

ఇదే సమయంలో కొన్ని ఛానల్స్ పేర్లు, పలువురు జర్నలిస్టులు పేర్లు చెబుతూ నిప్పులు చెరిగారు.

By:  Tupaki Desk   |   25 July 2024 7:41 AM GMT
సాయిరెడ్డి కొత్త ఛానెల్... తెరపైకి కీలక అప్  డేట్!?
X

ఇటీవల ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, ఆమె భర్త, బిడ్డ వ్యవహారంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ వ్యవహారంపై కనీసం తన వివరణ తీసుకోకుండానే స్పెషల్ బులిటెన్లు ప్రసారం చేస్తూ, డిబేట్లు కండక్ట్ చేస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారంటూ ఆయన ఫైర్ అయ్యారు.

ఇదే సమయంలో కొన్ని ఛానల్స్ పేర్లు, పలువురు జర్నలిస్టులు పేర్లు చెబుతూ నిప్పులు చెరిగారు. సదరు జర్నలిస్టులు కనీసం తన వివరణ తీసుకోకుండా టెలీకాస్ట్ చేశారని ఆరోపిస్తూ.. వారిని వాడూ, వీడూ అని సంభోదిస్తూ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాను త్వరలో ఓ కొత్త ఛానల్ ప్రారంభించబోతున్నట్లు సాయిరెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో ఓ అప్ డేట్ చక్కర్లు కొడుతోంది!

అవును... త్వరలోనే ఓ కొత్త టీవీ ఛానల్ ప్రారంభిస్తున్నట్లు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఈ ఛానల్ మాత్రం న్యూట్రల్ గా ఉంటుందంటూ ఆయన నాడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ ఛానల్ కు సంబంధించి ఓ అప్ డేట్ తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జోరుమీదున్న ఓ టీవీ ఛానెల్ సీఈవోను సాయిరెడ్డి ఆహ్వానించారని అంటున్నారు. సదరు సీఈవో... ఇప్పటికే ఆ ఛానల్ కు రాజీనామా చేశారని, దీనికి ఆమోదం కూడా లభించిందని ఈ మేరకు వైసీపీ నాయకుల మధ్య చర్చ జరుగుతుందని తెలుస్తోంది. అసలు సదరు సీఈవోఈ రాజీనామాకు సాయిరెడ్డే కారణం అని కూడా చెబుతున్నారు!

ఈ నేపథ్యంలో ఆ సీఈవోను తన చెంతకు చేర్చుకున్న సాయిరెడ్డి.. భారీ వేతనం ఆఫర్ చేశారని.. ఇదే సమయంలో సరైన టీం ను సెలక్ట్ చేసుకునే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారని సమాచారం. దీంతో... సదరు సీఈఓ ఒకటి రెండు రోజుల్లో పనులు మొదలుపెట్టనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదే క్రమంలో... ఛానల్ ప్రారంభానికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందని చెబుతుండటం గమనార్హం! ఇందులో భాగంగా... తెరవెనుక పనులన్నీ ఆగమేఘాల మీద చక్కబెట్టి.. ఈ ఏడాది దసరాకి ఈ కొత్త ఛానల్ ను ప్రారంభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రస్తుతం వైసీపీ అంతర్గత డిస్కషన్స్ అని అంటున్నారు! ఇప్పుడు ఈ విషయం మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది!