Begin typing your search above and press return to search.

భారత్ లో వ్యాక్సిన్ లేని కొత్త వైరస్... ఎవరికి సోకుదుందంటే...?

అవును... ప్రస్తుతం గుజరాత్ లో అనుమానాస్పద చాందీపురా వైరస్ కలకలం రేపుతోంది.

By:  Tupaki Desk   |   17 July 2024 10:27 AM GMT
భారత్  లో వ్యాక్సిన్  లేని కొత్త వైరస్... ఎవరికి సోకుదుందంటే...?
X

ప్రస్తుతం ఏ రకం వైరస్ అయినా... వైరస్ పేరు చెబితే చాలు ప్రపంచం వణికిపోతుంది. ఆ వైరస్ కు వ్యాక్సిన్ ఉందా అనేది అది తెలిసిన వెంటనే అడుగుతున్న తొలి ప్రశ్నగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్ లో ఓ కొత్త వైరస్ కలకలం రేపుతోంది. దీంతో... ఈ వైరస్ ఎవరికి సోకుతుంది.. లక్షణాలు ఏమిటి అనేది చర్చనీయాంశం అయ్యింది.

అవును... ప్రస్తుతం గుజరాత్ లో అనుమానాస్పద చాందీపురా వైరస్ కలకలం రేపుతోంది. చాందీపురా అనేది మహారాష్ట్రలోని ఓ గ్రామం. 1965లో ఇక్కడ తొలికేసు నిర్ధారణ అయ్యింది. దీంతో... ఈ వైరస్ కు ఆ ఊరి పేరే పెట్టినట్లు చెబుతున్నారు. ఈ వైరస్ ఇప్పుడు మరోసారి తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వైరస్ వల్ల మంగళవారం మరో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

దీంతో... మొత్తం ఈ వైరస్ 14 మందికి సోకగా... ఈ వైరస్ సోకి ఇప్పటివరకూ మృతిచెందినవారి సంఖ్య ఎనిమిదికి చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. ఇదే సమయంలో రాజస్థాన్ నుంచి ఇద్దరు, మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి మరొకరికి ఈ వైరస్ సోకినట్లు చెబుతున్నారు.

ఈ వైరస్ సోకినవారిలో మరణాల రేటు అధికంగా ఉండటం వల్ల చికిత్సలో ఎలాంటి ఆలస్యం, అశ్రద్ధ చేయకూడదని, అలా చేయడం ప్రాణాంతకమని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలో విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహించి, వైరస్ నివారణకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ క్రమంలో ఈ వ్యాది లక్షణాలు, ఎఫెక్ట్ మొదలైన విషాలపై తాజాగా వైద్యులు స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ వైరస్ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, విరేచనాలు ఉంటాయని తెలిపారు. తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛ, సృహ కోల్పోవడంతో పాటు మరణం సంభవించొచ్చని అన్నారు.

ఈ వైరస్ ఇసుక ఈగలు, దోమలు, పేలు వల్ల సోకుతుందని.. ఇది అంటువ్యాది కాదని చెప్పిన వైద్యులు... 9 నెలల నుంచి 14 ఏళ్ల పిల్లలపై దీని ప్రభావం ఉటుందని తెలిపారు. ప్రస్తుతానికి దీన్ని నిరోధించేందుకు వ్యాక్సిన్ అందుబాటులో లేదని తెలిపారు.