Begin typing your search above and press return to search.

పెళ్లి తర్వాత ఫ్రెండ్స్ తో కలిసేలా స్టాంప్ పేపర్ మీద వధువు సంతకం

తమిళనాడులోని మైలాడుదురై జిల్లా సీర్గాళి సమీపంలోని తెన్ పాడికి చెందిన ముత్తుకుమార్ కు.. సోమవారం పవిత్రతో పెళ్లి జరిగింది.

By:  Tupaki Desk   |   17 Sep 2024 5:30 AM GMT
పెళ్లి తర్వాత ఫ్రెండ్స్ తో కలిసేలా స్టాంప్ పేపర్ మీద వధువు సంతకం
X

పెళ్లి జరుగుతుంటే అమ్మాయికి ఒకలాంటి దిగులు. అబ్బాయికి అంతకు రెట్టింపు గుండెదడ. ఇప్పటివరకు స్నేహితుల్ని ఇట్టే కలిసే స్వేచ్ఛ మొత్తం పోతుందన్న భయాందోళనలు. ఈ తీరు మీద వచ్చే జోకులు అన్నిఇన్ని కావు. ఇలాంటివేళ.. పెళ్లి తర్వాత కూడా భర్తకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్న హామీ ఇవ్వటమే కాదు.. అందుకు తగ్గట్లు స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి మరీ.. భర్త స్నేహితులకు మాట ఇచ్చిన వధువు ఉదంతం ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ వైనం ఇప్పుడు వైరల్ గా మారింది.

తమిళనాడులోని మైలాడుదురై జిల్లా సీర్గాళి సమీపంలోని తెన్ పాడికి చెందిన ముత్తుకుమార్ కు.. సోమవారం పవిత్రతో పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలకు హాజరైన పెళ్లికొడుకు స్నేమితులు.. పెళ్లి తర్వాత తమ మిత్రుడు గతంలో మాదిరి కలవరన్న కలవరానికి గురయ్యారు. ఇలాంటి వేళ.. పెళ్లి కుమార్తె అనూహ్యంగా వ్యవహరించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

పెళ్లి తర్వాత తన భర్త తన స్నేహితుల్ని కలవరన్న చింత వద్దని.. తాను అందుకు కారణం కానన్న మాటను నోటి మాటగా కాకుండా చేతల్లో చేసి చూపించారు. వంద రూపాయిల బాండ్ పేపర్ ను తీసుకొచ్చి.. పెళ్లైన తర్వాత స్నేహితులతో తన భర్త పెళ్లికి ముందు ఎలా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడో.. అలానే ఉండేందుకు వీలుగా తాను అనుమతిస్తున్నట్లు పేర్కొంటూ సంతకం చేశారు. అంతేకాదు.. పెళ్లైన తర్వాత కూడా స్నేహితులతో కలిసి టూర్లకు వెళ్లేందుకు తాను ఒప్పుకుంటానని చెబుతూ సంతకం చేశారు. పెళ్లి తర్వాత తమ స్నేహితుడు తమకు కాకుండా పోతాడన్న బాధతో ఉన్న వారికి.. ఊహించనిరీతిలో స్వీట్ గిఫ్టు ఇచ్చిన వధువు వైనం అందరిని ఆకట్టుకుంటోంది.