Begin typing your search above and press return to search.

ఆ రెండు సీట్ల మీద వైసీపీ ఫోకస్...!?

వైసీపీ ఈసారి విశాఖ సిటీలోని రెండు కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల మీద దృష్టి పెట్టింది.

By:  Tupaki Desk   |   6 April 2024 5:30 AM GMT
ఆ రెండు సీట్ల మీద వైసీపీ ఫోకస్...!?
X

వైసీపీ ఈసారి విశాఖ సిటీలోని రెండు కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల మీద దృష్టి పెట్టింది. అది కూడా టీడీపీ సిట్టింగులు చాలా కాలంగా ఉంటున్న నియోజకవర్గాల మీద కావడం విశేషం. విశాఖలో పట్టు పెంచుకోవడం ద్వరా ఎంపీ సీటుని గెలుచుకొవడం అలాగే సిటీలో ఉన్న నాలుగు ఎమ్మెల్యేలలో కనీసంగా మూడు అయినా గెలుచుకోవాలన్నది వైసీపీ ప్లాన్ గా ఉంది అంటున్నారు.

ఇక చూస్తే విశాఖ నుంచి లోక్ సభకు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి మాజీ ఎంపీ అయిన బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేస్తున్నారు. విశాఖలో ఈసారి ఎంపీ సీటుకు టైట్ ఫైట్ ఉంటుందని అంటున్నారు. టీడీపీ నుంచి మాజీ ఎంపీ దివంగత నేత ఎంవీవీఎస్ మూర్తి మనవడు పోటీలో ఉన్నారు.

ఇక టీడీపీ వర్సెస్ వైసీపీ గా ఈసారి ఎంపీ స్థానానికి పోటీ ఉండబోతోంది. అలాగే టీడీపీకి గతంలో ఉన్నత సానుకూలత ఈసారి సిటీలో ఉండదని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దానికి కారణం సిటీలో ఈసారి మార్పులు ఉండడమే అంటున్నారు. వైసీపీ అభ్యర్ధులను మార్చింది. టీడీపీ చాలా చోట్ల పాతవారికే సీట్లు ఇచ్చింది. దాంతో ఆయన చోట్ల సిట్టింగులకు యాంటీ ఇంకెంబెన్సీ సమస్య ఉందని అంటున్నారు.

అలా విశాఖ తూర్పులో సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు మూడు టెర్ములు చేశారు. ఇక్కడ జనాలు మార్పు కోరుకుంటే వైసీపీకి ప్లస్ అవుతుంది. అలాగే విశాఖ పశ్చిమలో కూడా రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యే గణబాబు గెలిచారు. ఈసారి బిగ్ షాట్ గా విశాఖ డైరీ చైర్మన్ గా ఉన్న ఆడారి ఆనంద్ కుమార్ కి వైసీపీ సీటు ఇచ్చింది.

ఆయన గెలుపు కోసం బాగా కష్టపడుతున్నారు. పార్టీల విషయం పక్కన పెడితే ఎమ్మెల్యేలుగా గత పది పదిహేనేళ్లలో వారు చేసిన అభివృద్ధి ఏమిటి అని వైసీపీ అభ్యర్ధులు ప్రశ్నిస్తున్నారు. ఈసారి తమకు చాన్స్ ఇస్తే చేసి చూపిస్తామని అంటున్నారు. ఒక్క చాన్స్ అన్న నినాదంతో విశాఖ తూర్పులో వైసీపీ అభ్యర్ధి ఎంవీవీ సత్యనారాయణ, పశ్చిమలో ఆడారి ఆనంద్ కుమార్ జనాలను కలుస్తున్నారు.

జనంలో ఇదే విషయం చర్చకు పెడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు అనేక చాన్సులు ఇచ్చారు. మాకు కూడా ఒక అవకాశం ఇచ్చి చూడండి అన్నది వారి నినాదంగా ఉంది. మరో వైపు చూస్తే గణబాబు అయినా వెలగపూడి అయినా ప్రతిపక్షంలో ఉన్నపుడు ఏమీ చేయలేకపోయారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా వారి నియోజకవర్గాలలో అభివృద్ధి ఏమీ జరగలేదు అన్నది వైసీపీ ఆరోపణగా ఉంది.

దాంతో పాటుగా ఈ రెండు చోట్ల టీడీపీలో ఆశావహులు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఎపుడూ వారే తమకు చాన్స్ ఇవ్వలేదని వారు బాధపడుతున్నారు. అలాగే పశ్చిమలో బలమైన కాపు సామాజిక వర్గంలోనూ విశాఖ తూర్పులో మరో బలమైన యాదవ సామాజిక వర్గంలోనూ అసంతృప్తి ఉంది. దీంతో వీటిని సొమ్ము చేసుకుని ఈసారి సిట్టింగులను ఓడించి తాము గెలవాలని వైసీపీ చూస్తోంది. దాంతో విశాఖలో తూర్పు పశ్చిమల ఫలితం ఈసారి ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారుతోంది.