Begin typing your search above and press return to search.

కరోనా టైంలో ఇటలీలో వాలిపోయిన నాగచైతన్య..!

By:  Tupaki Desk   |   23 April 2021 5:30 PM GMT
కరోనా టైంలో ఇటలీలో వాలిపోయిన నాగచైతన్య..!
X
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య - డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''థాంక్యూ''. ఇందులో రాశీ ఖన్నా - మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అవికా గోర్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల వైజాగ్‌ లో ఓ షెడ్యూల్‌ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఇటలీలో ప్లాన్ చేయగా.. కోవిడ్ నేపథ్యంలో రద్దు చేసుకున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ అవాస్తవాలని తెలుస్తోంది. పాండమిక్ పరిస్థితుల్లో ‘థ్యాంక్యూ’ చిత్ర యూనిట్ తాజాగా ఇటలీలో ల్యాండ్‌ అయ్యారు.

ఈ నేపథ్యంలో 'థ్యాంక్యూ' చిత్రానికి వర్క్ చేస్తున్న లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ షూటింగ్ లొకేషన్స్ తీసిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. హీరో నాగచైతన్య - డైరెక్టర్ విక్రమ్ ఫోటోలను షేర్ చేసిన పీసీ శ్రీరామ్.. పాండమిక్ టైంలో జాగ్రత్తలు తీసుకుంటూ షూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటలీలో 15 రోజుల పాటు ఉండే షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందులో హీరోయిన్ రాశీఖన్నా కూడా పాల్గొంటోంది. దీని తర్వాతి షెడ్యూల్ పరిస్థితులను బట్టి హైదరాబాద్‌ లో ఉంటుందని సమాచారం.

కాగా, ‘థ్యాంక్యూ’ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై దిల్‌ రాజు - శిరీష్‌ - హ‌ర్షిత్ రెడ్డి లు కలిసి నిర్మిస్తున్నారు. బీవీఎస్‌ రవి ఈ సినిమాకి స్టోరీ అందించడంతో పాటు డైలాగ్స్ కూడా రాస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు వీరాభిమాని పాత్రలో నాగచైతన్య కనిపిస్తారని తెలుస్తోంది. అక్కినేని ఫ్యామిలీకి 'మనం' వంటి క్లాసిక్ ని అందించిన విక్రమ్‌ కె. కుమార్‌.. ఇప్పుడు నాగచైతన్యతో తీస్తున్న 'థ్యాంక్యూ' సినిమాతో ఎలాంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి.