Begin typing your search above and press return to search.

త్వ‌ర‌లో 100 రూపాయ‌ల ఎన్టీఆర్ స్మార‌క నాణెం: పురందేశ్వ‌రి

By:  Tupaki Desk   |   28 May 2022 11:59 AM GMT
త్వ‌ర‌లో 100 రూపాయ‌ల ఎన్టీఆర్ స్మార‌క నాణెం:  పురందేశ్వ‌రి
X
ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా.. తెలంగాణలోని హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన దగ్గుబాటి పురందేశ్వరి తన తండ్రిని స్మరించుకుని తీవ్ర‌ భావోద్వేగానికి గురయ్యారు. క‌న్నీరు పెట్టుకున్నా రు.

ఎన్టీఆర్ అంటే ఓ ప్రభంజనం అని.. ఆయనో సంచలనం అని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏడాది పాటు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.

రూ.వంద నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రణ గురించి తాము ఆర్బీఐతో మాట్లాడుతున్నామని వెల్లడించా రు. త్వ‌ర‌లోనే 100 రూపాయ‌ల ఎన్టీఆర్‌స్మార‌క నాణెం విడుద‌ల‌య్యేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపా రు.

ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్న నందమూరి, దగ్గు బాటి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.ఈ సంద‌ర్భంగా పురందేశ్వ‌రి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అనే పేరు ప్రతి తెలుగింటి గడప బతికున్నంత కాలం గుర్తుంటుందని అన్నారు.

రూ.వంద నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ ముద్రణ గురించి తాము ఆర్బీఐతో మాట్లాడుతున్నామని తెలిపారు. ‘నందమూరి తారక రామారావు ఒక సంచలనం. నేటి నుంచి వచ్చే ఏడాది మే 28 వరకూ ఈ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తాం. ఉత్సవాల నిర్వహణలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 12 కేంద్రాలను గుర్తించాం.

ఆయా కేంద్రాల్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల నిర్వహణ పర్యవేక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశాం. బాలకృష్ణ, రాఘవేంద్రరావు వంటి ప్రముఖులు ఆ కమిటీలో ఉన్నారు. అన్ని రంగాల్లో నిష్ణాతులైన వారిని ఘనంగా సత్కరించనున్నాం’’ అని పురందేశ్వరి తెలిపారు.