Begin typing your search above and press return to search.

అనంతలో విషాదం...11 మంది దుర్మ‌ర‌ణం

By:  Tupaki Desk   |   28 April 2017 9:53 PM IST
అనంతలో విషాదం...11 మంది దుర్మ‌ర‌ణం
X
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ఎర్రతిమ్మరాజు చెరువు (వైటీ చెరువు)లో ఘోరం చోటుచేసుకుంది. బోటు బోల్తా ప‌డి 13 మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కాగా ఓ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి - చికిత్స అందిస్తున్నారు. మిగతా నలుగురి కోసం ఈతగాళ్లు గాలిస్తున్నారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.

ఎర్ర‌తిమ్మ‌రాజు గ్రామానికి చెందిన రామన్న ఇంట్లో శుభకార్యం నిమిత్తం పొరుగు గ్రామానికి చెందిన వారు 20 మంది హాజరయ్యారు. వారంతా ఒక పాత బోటులో చెరువులో ప్రయాణం ప్రారంభించారు. చెరువు మధ్యలో ఉండగా పడవ బోల్తా పడింది. దీంతో పడవలోని 18 మంది మునిగిపోయారు. మృతుల్లో గజ ఈతగాళ్ల సాయంతో 13 మృతదేహాలను వెలికి తీశారు. అధికారులు - పోలీసు యంత్రాంగం సంఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన అతిథులు అకాల మృత్యువాత పడటంతో రామన్న కుటుంబసభ్యులు విలపిస్తున్నారు.

కాగా, పడవ బోల్తా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - ఏపీ ప్రతిపక్ష నేత - వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సంఘ‌ట‌నపై స్పందించి సీఎం చంద్ర‌బాబు జిల్లా అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటన స్థలంలోనే ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడే తెలియజేయాలని ‌, ఎస్పీని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/