Begin typing your search above and press return to search.

ఏపీలో ఒకేరోజు 14వేల కేసులు.. 71 మరణాలు

By:  Tupaki Desk   |   28 April 2021 4:06 PM GMT
ఏపీలో ఒకేరోజు 14వేల కేసులు.. 71 మరణాలు
X
ఏపీలో కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. కేసులు జెట్ స్పీడుగా పెరుగుతున్నాయి. రోజురోజుకీ కరోనా బారిన పడుతోన్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. బాధితులతోపాటు మరణాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది.

ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74748 పరీక్షలు నిర్వహించగా.. 14669 కేసులు నమోదయ్యాయి. 71మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా కేసులతో కలిపి ఇప్పటివరకు 10,69,544 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇక అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 9మంది, కృష్ణాలో 8మంది, అనంతపురం, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాలో ఏడుగురు చొప్పున మరణించారు.

ప్రస్తుతం ఏపీలో 107611 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా 2072 కేసులు నమోదయ్యాయి.