Begin typing your search above and press return to search.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలనం.. 8మంది ఐఏఎస్ లకు జైలు శిక్ష

By:  Tupaki Desk   |   31 March 2022 7:52 AM GMT
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలనం.. 8మంది ఐఏఎస్ లకు జైలు శిక్ష
X
కోర్టుల ఆదేశాలు ఇచ్చినా అమలు చేయని అధికారులు ఎంతో మంది ఉంటారు. కొందరేమో ప్రభుత్వ అండతో కోర్టును ధిక్కరిస్తూనే ఉంటారు. అయితే అలాంటి అధికారులకు న్యాయస్థానాలు గట్టి షాక్ ఇస్తున్నాయి. ఏకంగా ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించి ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.. 8మంది ఐఏఎస్ లకు జైలు శిక్ష విధించి షాక్ ఇచ్చింది. అధికారులకు రెండు వారాల పాటు శిక్ష విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఐఏఎస్ అధికారుల్లో విజయ్ కుమార్, శ్యామలారావు, జి.కే ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజా శంకర్, చినవీరభద్రుడు, ఎంఎం నాయక్ లు ఉన్నారు. దీంతో దెబ్బకు ఎనిమిది మంది అధికారులు హైకోర్టును క్షమాపణలు కోరారు.

స్పందించిన హైకోర్టు జైలు శిక్ష నుంచి తప్పించి సేవా కార్యక్రమాలకు ఆదేశించింది. సంక్షేమ హాస్టళ్లలో నెలలో ఒక రోజు వెళ్లి సేవా చేయాలని స్పష్టం చేసింది. ఏడాది పాటు హాస్టళ్లలో సేవా కార్యక్రమం చేపట్టాలని ఆదేశించింది. విద్యార్థుల మధ్యాహ్నం, రాత్రి భోజన ఖర్చులు.. ఒకరోజు కోర్టు ఖర్చులు భరించాలని ఆదేశించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ, వార్డు సచివాలయాల తొలగింపులనకు గతంలో హైకోర్టు ఆదేశించింది. ఉత్తర్వులు పట్టించుకోకపోవడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

2020లో ఇచ్చిన ఆదేశాలు ఏడాది పాటు పట్టించుకోలేదని మండిపడింది. ఈ క్రమంలో అధికారుల వైఖరిని హైకోర్టు కోర్టు ధిక్కరణగా భావించింది. ఉద్దేశ పూర్వకంగా కోర్టు ఉత్తర్వుల అమలు నిర్లక్ష్యం చేశారని ఆగ్రహించింది.