Begin typing your search above and press return to search.

వైసీపీలోకి బొబ్బిలి రాజులు రీ ఎంట్రీ ?

By:  Tupaki Desk   |   29 Nov 2020 2:30 AM GMT
వైసీపీలోకి బొబ్బిలి రాజులు రీ ఎంట్రీ ?
X
విజయనగరంలో మాజీమంత్రి, టీడీపీ నేత సుజయ కృష్ణ రంగారావు వైసీపీలోకి రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారా ? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి రంగారావు పార్టీ కార్యక్రమాలకు దాదాపు దూరంగానే ఉంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపిచ్చిన కార్యక్రమాలు కానీ లేకపోతే జిల్లాలో నేతలు చేపట్టే కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కనబడటం లేదు.

పార్టీ ఓడిపోయిన దగ్గర నుండి చంద్రబాబు కూడా తనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదనే మంట బాగా ఎక్కువగా ఉందట ఈ బొబ్బిలి రాజాలో. తనకన్నా జూనియర్ కిమిడి నాగార్జునకు ఇచ్చిన ప్రధాన్యత కూడా తనకు ఇవ్వటం లేదని తన మద్దతుదారుల దగ్గర తెగ బాధపోతున్నట్లు సమాచారం. వివిధ కమిటిల్లో జిల్లాలోని నేతలను తీసుకునేటపుడు తనను కనీసం అడగటం లేదని తెగ బాధపోతున్నారట.

ఇలాంటి అనేక కారణాలతో రంగారావు పార్టీకి దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు నిర్వహిస్తున్న జూమ్ కాన్ఫరెన్సుల్లో కూడా ఎక్కడా కనబడటం లేదట. వైసీపీలో బ్రహ్మాండంగా ఉన్నప్పటి రోజులను తలచుకుని బాధపడిపోతున్నారట. అనవసరంగా వైసీపీని వదిలేసి టీడీపీలోకి ఫిరాయించానని ఇపుడు క్షోభపడుతున్నట్లు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీకి రాజీనామా చేసి మళ్ళీ తన సోదరుడు బేబీ నాయనతో కలిసి వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వటానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. మరి జగన్ ఏమంటారో చూడాల్సిందే.