Begin typing your search above and press return to search.
సీఎం కూతురుకే టోకరా.. ! సైబర్ నేరగాళ్ల బరితెగింపు..!
By: Tupaki Desk | 9 Feb 2021 3:35 AM GMTఇటీవల సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఉన్నత విద్యావంతులు, సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన వాళ్లు కూడా సైబర్ దొంగల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కూతురు హర్షిత కేజ్రివాల్ ఆన్లైన్ మోసగాళ్ల చేతిలో మోసపోయింది. రూ. 35 వేలు ఆమె అకౌంట్ నుంచి కొట్టేశారు సైబర్ దొంగలు... ఇంతకీ ఏం జరిగిందంటే.. హర్షిత తమ ఇంట్లో ఉన్న ఓ సోఫాను ఓ ప్రముఖ వెబ్సైట్లో అమ్మకానికి పెట్టింది.
సదరు వెబ్ సైట్ పాత వస్తువులు.. అమ్మడం.. కొనుగోలు చేయడం చేస్తుంది. దీంతో ఈ వెబ్సైట్ నుంచి తాను సొఫా కొంటానంటూ హర్షితను సంప్రదించాడు. ఆ తర్వాత ఆ సోఫా గురించి ఓ ఒప్పందం కుదిరింది. అయితే తాను ముందుగా కొంత డబ్బు పంపిస్తానంటూ హర్షితకు సదరు వ్యక్తి ఓ క్యూఆర్ కోడ్ ను పంపించాడు. బ్యాంకు ఖాతను ధ్రువీకరించుకోవడానికి అంటూ కొంత డబ్బును కూడా పంపించాడు. దీంతో సదరు వ్యక్తి పంపించిన కోడ్ను హర్షిత స్కాన్ చేయడంతో ఆమె అకౌంట్ నుంచి రూ. 20 వేలు డెబిట్ అయ్యాయి. డబ్బులు డెబిట్ అయినట్టు ఫోన్లో మెసేజ్ రావడంతో సదరు వ్యక్తికి హర్షిత ఫోన్ చేసింది.
అయితే పొరపాటున అలా జరిగిందని.. ఈ సారి తాను పంపించబోయే కోడ్ ను స్కాన్ చేస్తే ఆ డబ్బు తిరిగి వస్తుందని నమ్మించాడు. దీంతో మరోసారి కోడ్ను స్కాన్ చేశాడు. ఆ కోడ్ను స్కాన్ చేయగా మరో 15 వేలు పోయాయి. ఆ తర్వాత సైబర్ నేరగాడు ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. తాను మోసపోయానని గ్రహించిన హర్షిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల సైబర్ నేరాలు పెరగిపోతున్నాయి. మధ్య తరగతి, ఉన్నతవర్గాల ప్రజలనే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసుకుంటున్నారు.
సదరు వెబ్ సైట్ పాత వస్తువులు.. అమ్మడం.. కొనుగోలు చేయడం చేస్తుంది. దీంతో ఈ వెబ్సైట్ నుంచి తాను సొఫా కొంటానంటూ హర్షితను సంప్రదించాడు. ఆ తర్వాత ఆ సోఫా గురించి ఓ ఒప్పందం కుదిరింది. అయితే తాను ముందుగా కొంత డబ్బు పంపిస్తానంటూ హర్షితకు సదరు వ్యక్తి ఓ క్యూఆర్ కోడ్ ను పంపించాడు. బ్యాంకు ఖాతను ధ్రువీకరించుకోవడానికి అంటూ కొంత డబ్బును కూడా పంపించాడు. దీంతో సదరు వ్యక్తి పంపించిన కోడ్ను హర్షిత స్కాన్ చేయడంతో ఆమె అకౌంట్ నుంచి రూ. 20 వేలు డెబిట్ అయ్యాయి. డబ్బులు డెబిట్ అయినట్టు ఫోన్లో మెసేజ్ రావడంతో సదరు వ్యక్తికి హర్షిత ఫోన్ చేసింది.
అయితే పొరపాటున అలా జరిగిందని.. ఈ సారి తాను పంపించబోయే కోడ్ ను స్కాన్ చేస్తే ఆ డబ్బు తిరిగి వస్తుందని నమ్మించాడు. దీంతో మరోసారి కోడ్ను స్కాన్ చేశాడు. ఆ కోడ్ను స్కాన్ చేయగా మరో 15 వేలు పోయాయి. ఆ తర్వాత సైబర్ నేరగాడు ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. తాను మోసపోయానని గ్రహించిన హర్షిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల సైబర్ నేరాలు పెరగిపోతున్నాయి. మధ్య తరగతి, ఉన్నతవర్గాల ప్రజలనే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసుకుంటున్నారు.