Begin typing your search above and press return to search.
టీడీపీకి చిన్న ఎన్టీవోడు ఇప్పుడు గుర్తుకువచ్చాడు...
By: Tupaki Desk | 15 May 2023 4:00 PMఎన్టీయార్ శత జయంతి వేడుకలను ఆయన కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ ముఖ్యులు కలసి అట్టహాసంగా ఏడాది పొడవునా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఏ వేడుకలోనూ ఎక్కడా ఆ అన్న గారికి అసలు సిసలు వారసుడు. ఆయన ఆహార్యం, అభినయం నిండుగా పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీయార్ ఎక్కడా కనిపించలేదు.
పిలిస్తే జూనియర్ ఎన్టీయార్ హాజరయ్యే వారే అని ఆయన అభిమానులు చెబుతూ వస్తున్నారు. దానికి ఇటీవల తెలంగాణాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంలో ఎన్టీయార్ 56 అడుగుల ఎత్తులో శ్రీక్రిష్ణుడి గెటప్ లో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరణకు పిలిస్తే ఒకె చెప్పారు జూనియర్.
దాన్ని చూసిన తరువాత తెలుగుదేశం పార్టీ నాలుక కరచుకుంది. జూనియర్ నిఎక్కడా పిలవలేదు. గత నేల చివరలో విజయవాడ నడిబొడ్డున జరిగిన ఎన్టీయార్ శత జయంతి ఉత్సవాలకు ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ని ఆహ్వానించారు. మొత్తానికి మొత్తం నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆ కార్యక్రమానికి హాజరైనా కూడా జూనియర్ ఎక్కడా కనిపించకపోవడంతో ఆయన ఫ్యాన్స్ చాలా గొడవ చేశారు.
ఈ పరిణామాలతో తెలుగుదేశం లో కూడా కలవరం రేగింది. దాని కంటే ముందు ఉమ్మడి క్రిష్ణా జిల్లా టూర్ కి చంద్రబాబు వెళ్లినపుడు కూడా జూనియర్ ఫ్యాన్స్ సీఎం జూనియర్ అంటూ గొడవ చేశారు. ప్ల కార్డులు ప్రదర్శించారు. వారిని సభ నుంచి బయటకు పంపించేశారు తెలుగుదేశం నాయకులు. ఇలా ఒక గ్యాప్ అయితే జూనియర్ తో టీడీపీకి ఉందన్న చర్చ వస్తోంది.
దాంతో దాన్ని తొలగించుకోవాలన్న ఉద్దేశ్త్యంతో ఉన్నరా లేక జూనియర్ ని రప్పించుకుని ఈసారి ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలన్న ఎత్తుగడ వేశారా అన్నది తెలియదు కానీ జూనియర్ ఇంటికి వెళ్ళి మరీ ఆయనకు అన్న గారి శత జయంతి ఉత్సవాల ఇన్విటేషన్ అందించారు.
ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ లో జరిగే ఎన్టీయార్ శత జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని ఉసవ కమిటీ చైర్మన్ హోదాలో టీడీ జనార్ధం, అలాగే ఎన్టీయార్ చివరి కుమారుడు నందమూరి రామక్రిష్ణ ఈ ఇన్విటేషన్ అందించారు. ఇక ఇపుడే అసలైన పాయింట్ చర్చకు వస్తోంది. ఈ నెల 20న హైదరాబాద్ లో జరిగే సభకు చంద్రబాబు బాలయ్య కూడా హాజరవుతారు. ముఖ్యంగా చంద్రబాబు తో కలసి వేదిక పంచుకోవడానికి జూనియర్ కి సమ్మతమేనా అన్న చర్చ వస్తోంది. తన తాత గారి శత జయంతి అని భావించి జూనియర్ వచ్చినా కూడా బాబు జూనియర్ ఒకే వేదిక మీద కనిపిస్తే చాలు అది రాజకీయ రచ్చగానే అవుతుంది.
ఇక మొత్తం నందమూరి ఫ్యామిలీని కూడా ఉత్సవ కమిటీ పిలుసోంది. వారంతా ఒక్క చోట కలిస్తే నారా తో నందమూరి బంధం బిగిసి అది అతి పెద్ద బలగంగా మారుతుంది. దాంతో జూనియర్ రాక మీదనే అందరి కళ్ళూ ఉన్నాయి. జూనియర్ తీసుకునే నిర్ణయం ఏపీ రాజకీయాలను, తెలుగుదేశం రాజకీయాలను మలుపు తిప్పుతుంది అని చెప్పాల్సి ఉంది.
ఇక మరో వైపు చూస్తే జూనియర్ ని ఖమ్మం రావాలని మొదట అక్కడ బీయారెస్ నేతలు, మంత్రులు ఇన్వైట్ చేశారు. అది జరిగిన ఇరవై రోజుల తరువాత టీడీపీ నేతలు పిలిచారు. ఇక ఈ నెల 28న అంటే అన్న గారి శత జయంతి వేళ ఖమ్మంలో విగ్రహావిష్కరణ ఉంటుంది. దానికి కచ్చితంగా జూనియర్ హాజరవుతారని అంటున్నారు. అది ఫిక్స్డ్ ప్రోగ్రాం అని అంటున్నారు.
దానికి ఒక రోజు ముందు నుంచి అంటే ఈ నెల 27, 28 తేదీలలో ఎన్టీయార్ శత జయంతి వేడుకలు రాజమండ్రీలో మహానాడులో కూడా జరుగుతాయి. ఈ శత జయంతి ఉత్సవాలకు పిలిచిన తరహాలోనే జూనియర్ ని మహానాడుకు పిలుస్తారా లేదా ఇవన్నీ డౌట్లుగానే ఉన్నాయి. ఏది ఏమైనా మొత్తానికి చిన్న ఎన్టీవోడు ఇన్నాళ్ళకు టీడీపీ పెద్దలకు గుర్తుకు వచ్చారని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఇది కేవలం లాంచనమా ఈ కధ ఇక్కడితో ఆగుతుందా ముందుకు సాగుతుందా అన్నది చూడాల్సి ఉంది.
అయితే తెలుగుదేశం వర్గాలు ఇపుడు జూనియర్ ని హైదరాబాద్ లో కార్యక్రమానికి జూనియర్ కనుక హాజరైతే మహానాడుకు కూడా ఆయన్ని పిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంటే బంతి ఇపుడు జూనియర్ కోర్టులో ఉంది. ఆయన బాబుతో కలుస్తారా. తెలుగుదేశం రాజకీయాల పట్ల ఆసక్తితో ఉన్నారా అన్నది ఈ నెల 20తో తేలందుంది. అన్నట్లు ఈ నెల 20న జూనియర్ బర్త్ డే కూడా. మరి ఆయన ఆ రోజున కీలకమైన నిర్ణయం తీసుకుంటారా అన్నదే చూడాల్సి ఉంది.
పిలిస్తే జూనియర్ ఎన్టీయార్ హాజరయ్యే వారే అని ఆయన అభిమానులు చెబుతూ వస్తున్నారు. దానికి ఇటీవల తెలంగాణాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంలో ఎన్టీయార్ 56 అడుగుల ఎత్తులో శ్రీక్రిష్ణుడి గెటప్ లో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరణకు పిలిస్తే ఒకె చెప్పారు జూనియర్.
దాన్ని చూసిన తరువాత తెలుగుదేశం పార్టీ నాలుక కరచుకుంది. జూనియర్ నిఎక్కడా పిలవలేదు. గత నేల చివరలో విజయవాడ నడిబొడ్డున జరిగిన ఎన్టీయార్ శత జయంతి ఉత్సవాలకు ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ని ఆహ్వానించారు. మొత్తానికి మొత్తం నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆ కార్యక్రమానికి హాజరైనా కూడా జూనియర్ ఎక్కడా కనిపించకపోవడంతో ఆయన ఫ్యాన్స్ చాలా గొడవ చేశారు.
ఈ పరిణామాలతో తెలుగుదేశం లో కూడా కలవరం రేగింది. దాని కంటే ముందు ఉమ్మడి క్రిష్ణా జిల్లా టూర్ కి చంద్రబాబు వెళ్లినపుడు కూడా జూనియర్ ఫ్యాన్స్ సీఎం జూనియర్ అంటూ గొడవ చేశారు. ప్ల కార్డులు ప్రదర్శించారు. వారిని సభ నుంచి బయటకు పంపించేశారు తెలుగుదేశం నాయకులు. ఇలా ఒక గ్యాప్ అయితే జూనియర్ తో టీడీపీకి ఉందన్న చర్చ వస్తోంది.
దాంతో దాన్ని తొలగించుకోవాలన్న ఉద్దేశ్త్యంతో ఉన్నరా లేక జూనియర్ ని రప్పించుకుని ఈసారి ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలన్న ఎత్తుగడ వేశారా అన్నది తెలియదు కానీ జూనియర్ ఇంటికి వెళ్ళి మరీ ఆయనకు అన్న గారి శత జయంతి ఉత్సవాల ఇన్విటేషన్ అందించారు.
ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ లో జరిగే ఎన్టీయార్ శత జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని ఉసవ కమిటీ చైర్మన్ హోదాలో టీడీ జనార్ధం, అలాగే ఎన్టీయార్ చివరి కుమారుడు నందమూరి రామక్రిష్ణ ఈ ఇన్విటేషన్ అందించారు. ఇక ఇపుడే అసలైన పాయింట్ చర్చకు వస్తోంది. ఈ నెల 20న హైదరాబాద్ లో జరిగే సభకు చంద్రబాబు బాలయ్య కూడా హాజరవుతారు. ముఖ్యంగా చంద్రబాబు తో కలసి వేదిక పంచుకోవడానికి జూనియర్ కి సమ్మతమేనా అన్న చర్చ వస్తోంది. తన తాత గారి శత జయంతి అని భావించి జూనియర్ వచ్చినా కూడా బాబు జూనియర్ ఒకే వేదిక మీద కనిపిస్తే చాలు అది రాజకీయ రచ్చగానే అవుతుంది.
ఇక మొత్తం నందమూరి ఫ్యామిలీని కూడా ఉత్సవ కమిటీ పిలుసోంది. వారంతా ఒక్క చోట కలిస్తే నారా తో నందమూరి బంధం బిగిసి అది అతి పెద్ద బలగంగా మారుతుంది. దాంతో జూనియర్ రాక మీదనే అందరి కళ్ళూ ఉన్నాయి. జూనియర్ తీసుకునే నిర్ణయం ఏపీ రాజకీయాలను, తెలుగుదేశం రాజకీయాలను మలుపు తిప్పుతుంది అని చెప్పాల్సి ఉంది.
ఇక మరో వైపు చూస్తే జూనియర్ ని ఖమ్మం రావాలని మొదట అక్కడ బీయారెస్ నేతలు, మంత్రులు ఇన్వైట్ చేశారు. అది జరిగిన ఇరవై రోజుల తరువాత టీడీపీ నేతలు పిలిచారు. ఇక ఈ నెల 28న అంటే అన్న గారి శత జయంతి వేళ ఖమ్మంలో విగ్రహావిష్కరణ ఉంటుంది. దానికి కచ్చితంగా జూనియర్ హాజరవుతారని అంటున్నారు. అది ఫిక్స్డ్ ప్రోగ్రాం అని అంటున్నారు.
దానికి ఒక రోజు ముందు నుంచి అంటే ఈ నెల 27, 28 తేదీలలో ఎన్టీయార్ శత జయంతి వేడుకలు రాజమండ్రీలో మహానాడులో కూడా జరుగుతాయి. ఈ శత జయంతి ఉత్సవాలకు పిలిచిన తరహాలోనే జూనియర్ ని మహానాడుకు పిలుస్తారా లేదా ఇవన్నీ డౌట్లుగానే ఉన్నాయి. ఏది ఏమైనా మొత్తానికి చిన్న ఎన్టీవోడు ఇన్నాళ్ళకు టీడీపీ పెద్దలకు గుర్తుకు వచ్చారని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఇది కేవలం లాంచనమా ఈ కధ ఇక్కడితో ఆగుతుందా ముందుకు సాగుతుందా అన్నది చూడాల్సి ఉంది.
అయితే తెలుగుదేశం వర్గాలు ఇపుడు జూనియర్ ని హైదరాబాద్ లో కార్యక్రమానికి జూనియర్ కనుక హాజరైతే మహానాడుకు కూడా ఆయన్ని పిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంటే బంతి ఇపుడు జూనియర్ కోర్టులో ఉంది. ఆయన బాబుతో కలుస్తారా. తెలుగుదేశం రాజకీయాల పట్ల ఆసక్తితో ఉన్నారా అన్నది ఈ నెల 20తో తేలందుంది. అన్నట్లు ఈ నెల 20న జూనియర్ బర్త్ డే కూడా. మరి ఆయన ఆ రోజున కీలకమైన నిర్ణయం తీసుకుంటారా అన్నదే చూడాల్సి ఉంది.