Begin typing your search above and press return to search.

సీబీఐ తాత్కాలిక చీఫ్ గా ప్రవీణ్​ సిన్హా..

By:  Tupaki Desk   |   5 Feb 2021 9:45 AM IST
సీబీఐ తాత్కాలిక చీఫ్ గా ప్రవీణ్​ సిన్హా..
X
సీబీఐ తాత్కాలిక చీఫ్​గా ప్రవీణ్​ సిన్హా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రవీణ్​ గుజరాత్​ కేడర్​కు చెందిన ఐపీఎస్​ అధికారి కావడం గమనార్హం. సీబీఐ డైరెక్టర్​గా​గా ఆర్ కే శుక్లా పదవీకాలం గత బుధవారంతో ముగిసింది. దీంతో సిన్హాకు అవకాశం దక్కింది. 1983 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ కు చెందిన శుక్లా 2019 జనవరిలో సీబీఐ డైరక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవికాలం పూర్తికావడంతో ప్రవీణ్​ సిన్హాకు అవకాశం దక్కింది.

ప్రవీణ్​ సిన్హాను తాత్కాలిక చీఫ్​గా నియమిస్తూ డిపార్ట్​మెంట్​ ఆఫ్​ పర్సనల్​ అండ్​ ట్రెయినింగ్​ (డీవీపీటీ) నోటిఫికేషన్​ విడుదల చేసింది. సిన్హా కొన్ని వారాలపాటు మాత్రమే ఈ పదవిలో కొనసాగతారని సమాచారం. ఆయన 1988 బ్యాచ్​ గుజరాత్​ క్యాడర్​కు చెందిన అధికారి గతంలో అనేక కీలకపదవులు నిర్వహించారు. 2015-18 మధ్య సెంట్రల్​ విజిలెన్స్ కమిషన్​కు​ అదనపు కార్యదర్శిగా సిన్హా పనిచేశారు. బాంబు పేలుళ్లు, ఆర్థిక నేరాలు వంటి కీలక కేసుల దర్యాప్తులో సిన్హా ముఖ్య పాత్ర పోషించారని సీబీఐ అధికార ప్రతినిధి ఆర్సీ జోషి తెలిపారు.

2017లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, 2020లో సీబీఐ (క్రైమ్​)ల నియమ నిబంధనలు రూపొందించడంలో ఆయన పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. సెంట్రల్​ విజిలెన్స్​ కమిషన్​ నియమ నిబంధనలు రూపొందించడంతో ఆయన పాత్ర కీలకం. అంతేకాక ప్రధాని మోదీకి, హోంశాఖ మంత్రికి అమిత్​ షాకు అయన అత్యంత సన్నిహితుడు.