Begin typing your search above and press return to search.
మళ్లీ బీఆర్ఎస్ వర్సెస్ వైసీపీ మంత్రుల లొల్లి వెనుక కారణం అదేనా?
By: Tupaki Desk | 13 April 2023 3:13 PM GMTతెలుగు రాష్ట్రాల్లో జిగ్రీ జాన్ దోస్తులు అయిన బీఆర్ఎస్, వైసీపీలు మళ్లీ కలహించుకుంటున్నాయి. ఇలా జరగడం చాలా సార్లు అయ్యింది. అయినా కూడా మరోసారి కీచులాట మొదలైంది. నిజానికి ఏపీలో జగన్ గెలుపు వెనుక కేసీఆర్ ఉన్నారని.. నాడు చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకే జగన్ ను గెలిపించారని.. హైదరాబాద్ లోని పలువురితో కలిసి సహకరించారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. అయితే జగన్ గెలిచాక స్వయంగా ప్రగతిభవన్ వచ్చి మరీ కేసీఆర్ ను కలిశారు. కృతజ్ఞత చాటుకున్నారు.
అయితే మధ్యలో గొడవలు గోదావరి, కృష్ణ నీటి కోసం.. ప్రాజెక్టుల కోసం ఇరు రాష్ట్రాల నేతలు, సీఎంలు మాటలు పేల్చుకున్నారు. నోరు పారేసుకున్నారు. అయితే ఇదంతా ఓట్ల రాజకీయం , భావోద్వేగాలను రెచ్చగొట్టడమేనని కొందరు రాజకీయవర్గాలు జగన్, కేసీఆర్ లపై అనుమానపు వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికీ రెండు రాష్ట్రాల సీఎంల మధ్య అంతగా సంబంధాలు లేవు. మంత్రులు కూడా తాజాగా ఒకరిపై ఒకరు నోరుపారేసుకుంటున్నారు.
తాజాగా మంత్రి హరీష్ రావు.. ఏపీ మేస్త్రీలు, కూలీలను తెలంగాణలోనే ఓటు హక్కు నమోదు చేసుకొని ఇక్కడే ఓటేయాలని పిలుపునిచ్చాడు. దానికి ఏపీ వైసీపీ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. అసలు తెలంగాణలో ఏం జరిగిందంటూ హరీష్ రావును కడిగేశారు.
ఏపీలోకి బీఆర్ఎస్ ఎంట్రీ వేళ వైసీపీ మంత్రుల మాటలకు మళ్లీ హరీష్ రావు రియాక్ట్ అయ్యి అసలు ఏపీ మంత్రులంతా ఏం చేతకాని వారు అని.. విశాఖ స్టీల్ ను కాపాడుకోలేరంటూ ఎద్దేవా చేశారు.
మొత్తంగా చూస్తే ఏదో ప్లాన్ ప్రకారమే మళ్లీ తెలుగు రాష్ట్రాల మంత్రులు విభేదాలు రాజేస్తున్నారని.. దీనివెనుక రాజకీయ కోణం ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. కేసీఆర్, జగన్ ఏదో ముందస్తుతోనే ఇలా చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
అయితే మధ్యలో గొడవలు గోదావరి, కృష్ణ నీటి కోసం.. ప్రాజెక్టుల కోసం ఇరు రాష్ట్రాల నేతలు, సీఎంలు మాటలు పేల్చుకున్నారు. నోరు పారేసుకున్నారు. అయితే ఇదంతా ఓట్ల రాజకీయం , భావోద్వేగాలను రెచ్చగొట్టడమేనని కొందరు రాజకీయవర్గాలు జగన్, కేసీఆర్ లపై అనుమానపు వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికీ రెండు రాష్ట్రాల సీఎంల మధ్య అంతగా సంబంధాలు లేవు. మంత్రులు కూడా తాజాగా ఒకరిపై ఒకరు నోరుపారేసుకుంటున్నారు.
తాజాగా మంత్రి హరీష్ రావు.. ఏపీ మేస్త్రీలు, కూలీలను తెలంగాణలోనే ఓటు హక్కు నమోదు చేసుకొని ఇక్కడే ఓటేయాలని పిలుపునిచ్చాడు. దానికి ఏపీ వైసీపీ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. అసలు తెలంగాణలో ఏం జరిగిందంటూ హరీష్ రావును కడిగేశారు.
ఏపీలోకి బీఆర్ఎస్ ఎంట్రీ వేళ వైసీపీ మంత్రుల మాటలకు మళ్లీ హరీష్ రావు రియాక్ట్ అయ్యి అసలు ఏపీ మంత్రులంతా ఏం చేతకాని వారు అని.. విశాఖ స్టీల్ ను కాపాడుకోలేరంటూ ఎద్దేవా చేశారు.
మొత్తంగా చూస్తే ఏదో ప్లాన్ ప్రకారమే మళ్లీ తెలుగు రాష్ట్రాల మంత్రులు విభేదాలు రాజేస్తున్నారని.. దీనివెనుక రాజకీయ కోణం ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. కేసీఆర్, జగన్ ఏదో ముందస్తుతోనే ఇలా చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.