Begin typing your search above and press return to search.

అగ్రిగోల్డ్ స్కాంలో ఈడీ విచారణ?

By:  Tupaki Desk   |   28 Dec 2020 9:09 PM IST
అగ్రిగోల్డ్ స్కాంలో ఈడీ విచారణ?
X
ఏపీలో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ నిందితులను ఇవాళ ఈడీ కస్టడీకి తరలించనున్నట్టు సమాచారం. ఈడీ కోర్టు నిందితులను పదిరోజుల కస్టడీకి అనుమతిచ్చింది. జనవరి 5 వరకు నిందితులను ప్రశ్నించేందుకు ఈడీ కోర్టు అనుమతిచ్చింది.

అగ్రిగోల్డ్ చైర్మన్ ఏవీ శేషు నారాయణ రావు, మేనేజింగ్ డైరెక్టర్ హేమ సుందర వరప్రసాద్ ను చంచల్ గూడ జైలు నుంచి ఈడీ కార్యాలయానికి తరలించనున్నారు. నిందితులను జైలు నుంచి ఈడీ కార్యాలయానికి అధికారులు ప్రస్తుతం తరలిస్తున్నట్టు తెలిసింది.

ఇప్పటికే అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. రూ.4109 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలోని ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

రూ.942.96 కోట్ల సొమ్మును ఇతర కంపెనీలకు అగ్రిగోల్డ్ తరలించినట్లు గుర్తించారు. 7 రాష్ట్రాల్లో 32 లక్షల డిపాజిట్ల ద్వారా రూ. 6380 కోట్లను అగ్రిగోల్డ్ సేకరించింది. మనీలాండరింగ్ పై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.