Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే కుటుంబంలో విషాదం

By:  Tupaki Desk   |   3 Sept 2020 9:30 PM IST
వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే కుటుంబంలో విషాదం
X
గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంట తీవ్ర విషాదం అలుముకుంది. గురువారం ఆయన తండ్రి మరణించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆళ్ల దశరథరామిరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పట్ల సీఎం జగన్, వైసీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.

కాగా ఆళ్ల దశరథరామిరెడ్డికి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితోపాటు పెద్ద కుమారుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.ఇద్దరు కొడుకులు వైసీపీలో ఎమ్మెల్యే, ఎంపీలుగా ఉన్నారు.

అయోధ్య రామిరెడ్డి గతంలో నర్సారావుపేట నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఇటీవలే జగన్ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చాడు.