Begin typing your search above and press return to search.

చైనాతో ఇక తెగదెంపులే .. ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   15 May 2020 1:45 PM IST
చైనాతో ఇక తెగదెంపులే .. ట్రంప్ కీలక వ్యాఖ్యలు!
X
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ..ఈ మహమ్మారి విజృంభణ మొదలైనప్పటినుండి , ఈ మహమ్మారికి అసలు కారణం చైనానే అని, మహమ్మారి విషయంలో చైనా ప్రపంచాన్ని మోసం చేసిందంటూ పదే పదే విరుచుకుపడుతున్నారు. ఈ తరుణంలో మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌ తో చర్చలు జరిపే మూడ్ తనకు లేదని మండిపడ్డారు. అలాగే, చైనాతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకోనున్నామని, ఇక చైనా అధినేత జిన్‌ పింగ్‌ తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ట్రంప్ తెలిపారు .

తాజాగా ఫాక్స్ బిజినెస్ న్యూస్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చేయాల్సినవి చాలా వున్నాయి. చైనాతో మొత్తం సంబంధాలను తెంచుకునే ఆలోచనలో ఉన్నామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. నిజానికి జీ జిన్‌ పింగ్‌ తనకు చాలా మంచి సంబంధాలే ఉన్నాయనీ, కానీ ప్రస్తుతం అతనితో మాట్లాడే ఆసక్తిలేదు. చాలా నిరాశకు గురయ్యానని ట్రంప్ చెప్పుకొచ్చారు. కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో చైనా సరిగా వ్యవహరించ లేదని, వైరస్ వ్యాప్తిని ఆపి వుండాల్సిందంటూ మరోసారి చైనా పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

ఈ నేపథ్యంలోనే చైనా పెట్టుబడుల నుండి యుఎస్ పెన్షన్ ఫండ్ ‌ను ఉపసంహరించుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వైరస్ కరంమంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 86 వేలకు పైగా మరణాలు అమెరికాలోనే నమోదు కావడం గమనార్హం. దీనితో ట్రంప్ చైనా పై మండిపడుతున్నాడు. చైనా పై ప్రతీకారంగా చైనా ఈక్వీటీ మార్కెట్లలో పెట్టాలని నిర్ణయించిన భారీ పెట్టుబడుల్ని నిలిపివేయాలని యోచిస్తున్నట్లు ఇటీవల వ్యార్తలు వ్యాపించిన సంగతి తెలిసిందే