Begin typing your search above and press return to search.

వృద్ధుడికి పెళ్లి ఆశ చూపి కోటితో మహిళ పరార్

By:  Tupaki Desk   |   9 March 2021 1:30 AM GMT
వృద్ధుడికి పెళ్లి ఆశ చూపి కోటితో మహిళ పరార్
X
పండు ముసలి వాడికి పడుచు పోరి భార్యగా వస్తానంటే ఆ ముసలోడి ఆనందం అంతా ఇంతకాదు.. అలానే తనకు ఓ మంచి జోరుమీదున్న మహిళ జీవితంలోకి వస్తుందనుకున్న వృద్ధుడికి గట్టి షాక్ తగిలింది. ఆమె మాటలు నమ్మి రూ.కోటి నష్టపోయాడు వృద్ధుడు.

ముంబైలోని మలద్ ప్రాంతంలో నివసించే 73 ఏళ్ల జెరాన్ డిసౌజా 2010లో తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించాడు. దాంతో వచ్చిన రూ.2 కోట్లను ప్రైవేటు బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేశాడు.2019లో ఫిక్స్ డ్ డిపాజిట్ .. దానిపై వడ్డీ రూపంలో వచ్చిన భారీ మొత్తం నగదును ఉపసంహరించుకున్నాడు.అయితే అదే బ్యాంకులో పనిచేస్తున్న షాలినీ ఈ విషయం గమనించింది. జెరాన్ డబ్బును కొట్టేయాలని ప్లాన్ చేసింది.

వృద్ఢుడితో పరిచయం పెంచుకుంది. వివాహం చేసుకుంటానని మాటిచ్చింది. ఇద్దరూ కలిసి రెస్టారెంట్లకు, షికార్లకు తిరిగారు. తర్వాత తానొక వ్యాపారం ప్రారంభిస్తానని అందులో పెట్టుబడి పెట్టాలని జెరాన్ ను షాలినీ కోరింది.లాభాలు చెరిసగం పంచుకుందామని నమ్మించింది. కాబోయే భార్య కదా అని ఏకంగా జెరాన్ 1.3 కోట్ల డబ్బును 2020 డిసెంబర్ లో షాలినీ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయించాడు. నగదు తన అకౌంట్లో పడగానే షాలినీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది.

జెరాన్ ఆమెను కలుసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాడు. దీంతో మోసపోయాయని తెలుసుకున్న బాధితుడు గత డిసెంబర్ లోనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు మోసం జరిగినట్లు నిర్ధారించి తాజాగా కేసు నమోదు చేశారు.