Begin typing your search above and press return to search.

ధోనీ, కోహ్లీల భార్యల షాకింగ్‌ రిలేషన్‌

By:  Tupaki Desk   |   31 Jan 2019 12:32 PM GMT
ధోనీ, కోహ్లీల భార్యల షాకింగ్‌ రిలేషన్‌
X
లెజెండ్రీ ఆటగాళ్లైన ధోనీ మరియు కోహ్లీలు టీం ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను తెచ్చి పెట్టారు. వీరిద్దరు ఆటగాళ్లుగానే కాకుండా కెప్టెన్స్‌ గా కూడా మంచి రికార్డులు దక్కించుకున్నారు. అందుకే వీరిద్దరిని క్రికెట్‌ లెజెండ్స్‌ అనడంలో ఎమాత్రం సందేహం లేదు అనేది క్రీడాభిమానుల అభిప్రాయం. వీరిద్దరు కూడా ఎన్నో విషయాల్లో కామన్‌ పాయింట్స్‌ ను కలిగి ఉంటారు. అయితే ఒక కామన్‌ విషయం మాత్రం అనూహ్యంగా చాలా ఏళ్లకు వెళ్లడయ్యింది.

అదేంటీ అంటే వీరిద్దరి భార్యలు అదే సాక్షి మరియు అనుష్క శర్మలు క్లాస్‌ మెట్స్‌. అది కూడా ఇద్దరు కలిసి ఒకే స్కూల్‌ లో, ఒకే క్లాస్‌ లో కలిసి చదువుకున్నారు. ఆ విషయం వారిద్దరు కూడా మర్చి పోయారు. చాలా చిన్నప్పుడు కలిసి చదువుకున్న కారణంగా ఇద్దరు కూడా కలిసి చదువుకున్నట్లుగా గుర్తించలేక పోయారు. తాజాగా వీరిద్దరు కలిసి చదువుకున్న సెయింట్‌ మేరీస్‌ స్కూల్‌ కు సంబంధించిన ఒక పాత ఫొటో బయటకు వచ్చింది. ఆ ఫొటోలో వీరిద్దరు ఉన్నారు.

ఆ ఫొటోలో వారిని వారు గుర్తు పట్టుకున్న అనుష్క మరియు సాక్షిలు సంభ్రమాక్షర్యాలకు లోనయ్యారు. పై ఫొటోలో పింక్‌ డ్రస్‌ వేసుకున్నది అనుష్క కాగా, రాజు లా గెటప్‌ వేసుకుని వృతంలో ఉన్నది సాక్షి. వీరిద్దరిని ఇలా ఒకే ఫ్రేమ్‌ లో చూసి ధోని మరియు కోహ్లీ అభిమానులు అవాక్కవుతున్నారు. ఒకే స్కూల్‌, ఒకే క్లాస్‌ కు చెందిన వారు ఇలా క్రికెట్‌ లెజెండ్రీస్‌ ను పెళ్లి చేసుకోవడం కాకతాళీయం. అయితే ఇది ఇన్నాళ్లకు తెలియడం మరింత విచిత్రమైన విషయం.

ఆర్మీ కల్నల్‌ అయిన అనుష్క శర్మ తండ్రి దేశంలోని పలు ప్రాంతాల్లో డ్యూటీ నిర్వహించారు. అందుకే అనుష్క శర్మ చాలా ప్రాంతాల్లో చదువుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగానే తాను ఒకసారి అస్సాంలో కూడా చదువుకున్నట్లుగా అనుష్క గతంలోనే చెప్పుకొచ్చింది. కాని సాక్షితో కలిసి చదువుకున్నట్లుగా అప్పట్లో ఆమెకు కూడా తెలియదు.