Begin typing your search above and press return to search.

ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాలు.. సీఎం జగన్ జిల్లా లాస్ట్‌!

By:  Tupaki Desk   |   22 Jun 2022 10:30 AM GMT
ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాలు.. సీఎం జగన్ జిల్లా లాస్ట్‌!
X
ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ఫస్ట్ ఇయర్, సెకండ్‌ ఇయర్‌ పరీక్షా ఫలితాలు జూన్ 22న‌ విడుదలయ్యాయి. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర‌వ్యాప్తంగా 9 ల‌క్ష‌ల మందికి పైగా ప‌రీక్ష‌లు రాశారు. మే 6 నుంచి 25 వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన 28 రోజుల్లోనే ఫ‌లితాలు ప్ర‌క‌టించారు. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ లో మొత్తం 2,41,591 (54 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక‌ సెకండ్ ఇయర్‌లో 2,58,449 (61 శాతం) మంది పాస్‌ అయ్యారు.

ఫస్ట్‌ ఇయర్‌లో బాలుర ఉత్తీర్ణత శాతం 49%గా ఉండగా, బాలికలు 60 శాతం మంది పాస్‌ అయ్యారు. ఇక సెకండ్ ఇయర్‌లో బాలురు 56 శాతం, బాలికలు 68 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

జిల్లాల పరంగా చూసుకుంటే కృష్ణా జిల్లా 75 శాతంతో మొద‌టి స్థానంలో నిల‌వ‌గా, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లా కడపలో అతి త‌క్కువ ఉత్తీర్ణ‌త 55 శాతం నమోదైంది. రెండో స్థానంలో 68 శాతంతో గుంటూరు నిలవగా తర్వాతి స్థానాల్లో వరుసగా.. నెల్లూరు (67 శాతం), విశాఖపట్నం (65 శాతం), ప‌శ్చిమ‌ గోదావరి (64 శాతం), ప్రకాశం (59 శాతం), చిత్తూరు (58 శాతం), తూర్పు గోదావరి (58 శాతం), శ్రీకాకుళం (57 శాతం ), కర్నూలు (55 శాతం), అనంతపురం (55 శాతం), విజయనగరం (50 శాతం), కడప (50 శాతం) నిలిచాయి.

కాగా.. బాలురుల్లో అత్యధికంగా ఉత్తీర్ణత సాధించిన జిల్లాగా 66 శాతంతో కృష్ణా జిల్లా టాప్ లో నిలిచింది. అలాగే బాలిక‌ల విషయంలోనూ 72 శాతంతో కృష్ణా జిల్లా నిలిచింది. ఇక అతి త‌క్కువగా బాలురు (34 శాతం), బాలిక‌లు (47 శాతం) ఉత్తీర్ణ‌త న‌మోదు అయిన‌ జిల్లాగా క‌డ‌ప నిలిచింది.

కాగా విద్యార్థుల‌కు జూన్ 25 నుంచి జూలై 5 వరకూ రీ కౌంటింగ్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఫెయిల్‌ అయిన అభ్యర్థులకు ఆగస్టు 3 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వ‌హిస్తారు.

2020లో 59 శాతం మంది, 2019లో 55 శాతం, 2018లో 57 శాతం, 2017లో 60.01 శాతం, 2016లో 60.59 శాతం, 2015లో 55.87 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.