Begin typing your search above and press return to search.

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ న్యూస్ .. ఏంటంటే !

By:  Tupaki Desk   |   26 Jun 2021 4:30 PM GMT
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ న్యూస్ .. ఏంటంటే !
X

నిరుద్యోగులకు, ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోటీ పరీక్షల్లో ఇంటర్యూలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏపీపీఎస్సీ లో ఇంటర్వ్యూ విధానాన్ని ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకూ ఏపీపీఎస్సీ పరీక్షలో సాధించిన మార్కులతో పాటు ఇంటర్వ్యూ మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుని వాటి ఆధారంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసేవారు. దీనితో పలువురు ఎగ్జామ్స్ బాగా రాసినా కూడా ఇంటర్వ్యూ పూర్తి చేయలేక ఉద్యోగాలకు అనర్హులయ్యే వారు.

అయితే , తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి ఇంటర్వ్యూలు ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్ పరీక్షల్లో సంపూర్ణ పారదర్శకత కోసం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపీపీఎస్సీ పోటీ పరీక్షల్లో ఇక నుంచి ఇంటర్వ్యూలు ఉండవు. గ్రూప్ 1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు కూడా ఇంటర్య్యూలు ఎత్తివేశారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగాల భర్తీలో ఇక నుంచి ఇంటర్య్వూలు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. పోటీ పరీక్షల్లో పూర్తి పారదర్శకతకోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తామని పేర్కొంది.