Begin typing your search above and press return to search.

మోడీకి కేజ్రీ హితబోధ

By:  Tupaki Desk   |   10 Jan 2017 10:05 AM GMT
మోడీకి కేజ్రీ హితబోధ
X
ప్రధాని మోడీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ చురకలేశారు. గుజరాత్ లో పర్యటిస్తున్న మోడీ తన తల్లిని కలిసి.. ఆ సంగతి ట్వీట్ చేయగా కేజ్రీ దానికి రెస్పాండ్ అయ్యారు. ఒక రోజు కలిస్తే గొప్ప కాదు.. ఈ స్థాయిలో ఉంటూ తల్లిని దూరంగా ఉంచడంం పద్ధతి కాదని, తల్లిని తన ఇంట్లోనే ఉంచుకుంటే బెటరని.. తాను అలాగే చేస్తానని అన్నారు.

గుజరాత్ లో పర్యటిస్తున్న మోడీ ట్వీటు చేస్తూ ఈ రోజు ఉద‌యం యోగా చేయడం మానేశాన‌ని, తన తల్లి హీరాబెన్ ను కలిసేందుకు వెళ్లానని, ఆమెతో కలసి టిఫిన్ చేశానని పోస్ట్ చేశారు. అయితే, ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు తెలిపిన మోడీపై అదే ట్విట్ట‌ర్ ద్వారా కేజ్రీవాల్ విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌న త‌ల్లి మాత్రం త‌న‌తోనే ఉంటుంద‌ని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాను ప్ర‌తిరోజు ఆమె ఆశీర్వాదాలు తీసుకుంటాన‌ని, అస‌లు హిందూ మ‌త గ్రంథాల ప్ర‌కారం తల్లి, భార్య‌ను ప్ర‌తి వ్య‌క్తి త‌న‌తోనే ఉండ‌నివ్వాలని హిత‌బోధ చేశారు.

అక్కడితో ఆగని ఆయన... ప్ర‌స్తుతం మోడీ ఇల్లు చాలా పెద్ద‌దిగా ఉందని, క‌నీసం ఇప్పుడయినా ఆయ‌న త‌న‌త‌ల్లిని త‌న ద‌గ్గ‌రే ఉండేలా చూసుకోవ‌చ్చుగా అని ట్వీట్ చేశారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసమే న‌రేంద్ర మోడీ త‌న త‌ల్లిని వాడుకుంటున్నార‌ని కేజ్రీవాల్ ఆరోపించారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసమే కొన్ని రోజుల క్రితం మోడీ త‌న త‌ల్లిని బ్యాంకు క్యూలో నిల‌బెట్టారని కూడా అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/