Begin typing your search above and press return to search.

చంద్రుడి యాత్ర చేసిన ఆస్ట్రోనాట్ కన్నుమూత

By:  Tupaki Desk   |   29 April 2021 4:45 AM GMT
చంద్రుడి యాత్ర చేసిన  ఆస్ట్రోనాట్ కన్నుమూత
X
చందమామపై మానువుడు తొలిసారిగా పాదం మోపి ఎన్నో ఏళ్లు అవుతోంది. ఆ అపూర్వమైన ఘట్టంలో అమెరికన్ వ్యోమగామి మైఖేల్ కొలిన్స్ కీలక పాత్రధారి. 90 ఏళ్ల మైఖేల్ తాజాగా మరణించారు.

చంద్రుడిపైకి వెళ్లిన అపోలో-11 వ్యోమనౌక ఆస్ట్రోనాట్ మైఖేల్ కొలిన్స్ (90) చనిపోయారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

1969 లో చంద్రుడిపై మానవుడు తొలిసారిగా పాదం మోపిన అపూర్వ ఘట్టంలో కీలక పాత్రధారుల్లో ఆయన ఒకరు. అపోలో మిషన్ లో ప్రయాణించిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ లూనార్ ల్యాండర్ ద్వారా చందమామపై పాదం మోపిన విషయం తెలిపారు.

అయితే ఆ టైంలో చందమామ ఉపరితలానికి 69 కి.మీ దూరంలోని కమాండ్ మాడ్యూల్ లో కొలిన్స్ ఉన్నారు. చంద్రుడిపై యాత్రలో ఈయన కీలక పాత్రధారి.