Begin typing your search above and press return to search.

లారీపైకి దూసుకెళ్లిన అయ్య‌ప్ప‌స్వాముల బ‌స్సు ..20 మందికి గాయాలు

By:  Tupaki Desk   |   27 Nov 2022 2:30 PM GMT
లారీపైకి దూసుకెళ్లిన అయ్య‌ప్ప‌స్వాముల బ‌స్సు ..20 మందికి గాయాలు
X
అయ్య‌ప్పస్వామి మాల‌లు ధ‌రించిన భ‌క్తుల‌తో వెళుతున్న ఒక బ‌స్సు ఎదురుగా వ‌స్తున్న లారీపైకి దూసుకెళ్ల‌డంతో 20 మంది అయ్య‌ప్ప‌స్వాములు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ఒంగోలులో ఆదివారం తెల్ల‌వారు జామున ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. డాక్ట‌ర్ బీ ఆర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా నుంచీ అయ్య‌ప్ప‌మాల లు వేసుకున్న భ‌క్తుల బృందం బ‌స్సులో శ‌బ‌ర‌మిలైకి బ‌య‌లుదేరింది. వారు ప్ర‌యాణిస్తున్న బస్సు ఆదివారం తెల్ల‌వారు జామున ఒంగోలుకు సమీపంలో ప్రమాదానికి గురైంది ఈ ప్ర‌మాదంలో 20 మంది అయ్య‌ప్ప భ‌క్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు

అయ్య‌ప్ప స్వాములు ప్ర‌యాణిస్తున్న బ‌స్సు ఒంగోలు స‌మీపంలోకి రాగానే అదుపు తప్పి ఎదురుగా వెళుతున్న టిప్ప‌ర్‌పైకి దూసుకెళ్లి దాన్ని బ‌లంగా ఢీకొట్టింది. దాంతో బ‌స్సు ముందు బాగం నుజ్జునుజ్జ‌యింది.

ఈ ప్ర‌మాదంలో బ‌స్సు డ్రైవ‌ర్‌తో పాటు 20 మంది అయ్య‌ప్ప‌స్వాములు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే స్థానిక ప్ర‌జ‌లు, పోలీసులు హుటాహుటిన అక్క‌డికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన వారిని ఒంగోలు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేయిస్తున్నారు.

ఈ ప్ర‌మాదానికిగ‌ల కార‌ణాలపైన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. పొగ‌మంచే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని అనుమానిస్తున్నారు. క్ష‌త‌గాత్రులంద‌రికి మెరుగైన వైద్యం అందిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.