Begin typing your search above and press return to search.

ఒకే వేదికపై బాలయ్య, కవిత!

By:  Tupaki Desk   |   26 Oct 2016 12:25 PM IST
ఒకే వేదికపై బాలయ్య, కవిత!
X
గతంలో ఒకసారి జాగ్వార్ ఆడియో ఫంక్షన్ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లు ఒకే వేదికపై కనిపిస్తారని చాలా మంది భావించారు. కానీ... కొన్ని కారణాలవల్ల అది సాధ్యం కాలేదు. దీంతో నిరాశ చెందిన వారికి తాజాగా బాలకృష్ణ - కవిత లరూపంలో మరో కొత్త కాంబినేషన్ ని వేదికపై చూసే అవకాశం దక్కింది. దీనికి బెస్ట్ క్యాన్సర్ పై నిర్వహిస్తున్న అవగాహన సదస్సు వేదికైంది.

ప్రముఖ సినీనటుడు - హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ - నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఒకే వేదికపై సందడి చేశారు. బ్రెస్ట్ క్యాన్సర్‌ పై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో వీరిద్దరు పాల్గొని మాట్లాడారు. వీరితోపాటు నటి మంచు లక్ష్మి కూడా ఈ వేదికను పంచుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య... ప్రతీ మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌ పై అవగాహన కలిగి ఉండాలని, అలా అవగాహన లేకపోవడం వల్లే అనేకమంది మహిళలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో అందరి కోసం పనిచేసే మహిళ తన ఆరోగ్యం గురించి మాత్రం పట్టించుకోవడం లేదని, బ్రెస్ట్ కేన్సర్ కారణంగా ఎందరో తల్లులను, అక్కలను పోగొట్టుకున్నామని, ఇక నుంచి అటువంటి పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో పింక్ రిబ్బన్ వాక్ ను వారి వారి అవగాహన కోసం నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. అలాగే బాలకృష్ణ లాంటి సెలెబ్రిటీలు ఈ అంశం గురించి చెబితేనే అందరికీ చేరుతుందని కవిత ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో బసవతారకం ఆస్పత్రి ట్రస్ట్ ని కూడా ప్రశంసించిన కవిత... ఈ విషయంలో ముందుకు దూసుకెళ్తున్న బాలకృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే... ఈ వ్యాధి గురించి చర్చించుకునేందుకు సిగ్గుపడాల్సిన అవసరం మంచు లక్ష్మి అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/