Begin typing your search above and press return to search.

వైరల్ ఫొటో: ప్రస్తుతం హైదరాబాద్ ని వణికిస్తున్న వాడు వీడే?

By:  Tupaki Desk   |   4 March 2020 3:53 AM GMT
వైరల్ ఫొటో: ప్రస్తుతం హైదరాబాద్ ని వణికిస్తున్న వాడు వీడే?
X
బ్లూ షర్ట్ చొక్కా.. నల్లటి ప్యాంటు.. ఆస్పత్రి బెడ్ పై కాలుమీద కాలుసుకొని ముఖానికి మాస్కుతో ఠీవీగా ఉన్న ఇతడు ఎవరు? అని ఆశ్చర్యపోకండి.. అతడు ప్రస్తుతం హైదరాబాద్ ను వణికిస్తున్న కరోనా బాధితుడు? షాకింగా? నిజామా అని ఆశ్ఛర్యపోకండి..? అక్కడికే వస్తున్నాం..

ఇతడే దుబాయ్ నుంచి కరోనా వైరస్ నుంచి భారత్ తీసుకొచ్చిన 24 ఏళ్ల యువకుడు అని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. సపరేట్ గా ఆస్పత్రిలో ఉంచిన ఇతడి ఫొటోను తీశారని.. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని అంటున్నారు.

అయితే చావు తరుముకొస్తున్న అలా ఆస్పత్రి బెడ్ పై కాలుమీద కాలు వేసుకొని చుట్టూ ఎవరూ లేకున్నా ఠీవీగా నిలబడ్డ ఇతడు కరోనా బాధితుడో లేదా ఫేక్ ఫొటోనో తెలియదు కానీ.. ఈ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఈ పిక్ లో ఉన్నది తెలంగాణలో నమోదైన తొలి కరోనా బాధితుడు అంటూ హోరెత్తిస్తున్నారు. ఇది నిజమో కాదో కానీ పరిస్థితి చూస్తుంటే మాత్రం నిజమేలానే కనిపిస్తోంది.

ఎందుకంటే ఐసోలేషన్ వార్డు లో ఇతడు ఒక్కడే కనిపిస్తున్నారు. చుట్టూరా బెడ్స్ అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇక బెడ్ పై ముఖానికి మాస్క్ తో ఉండడం.. ఇతడి చుట్టుపక్కల బంధువులు, వైద్యులు ఎవరూ లేకపోవడంతో ఇతడే హైదరాబాద్ లో నమోదైన తొలి కరోనా బాధితుడు అని ప్రచారం సాగుతోంది. అయితే నిజమా కాదా అన్నది మాత్రం అధికారికంగా తెలియదు.. కానీ కరోనాను తీసుకొచ్చి ప్రజలను ముఖ్యంగా హైదరాబాదీలను వణికిస్తున్నది వీడేనని తెగ ప్రచారం అయితే సాగుతోంది.