Begin typing your search above and press return to search.

బైడెన్ ప్ర‌తీకారం నెర‌వేర్చుకున్నారు.. మ‌రి ఇప్పుడు ఏం జ‌రుగుతుంది?

By:  Tupaki Desk   |   28 Aug 2021 9:31 AM GMT
బైడెన్ ప్ర‌తీకారం నెర‌వేర్చుకున్నారు.. మ‌రి ఇప్పుడు ఏం జ‌రుగుతుంది?
X
అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ అనుకున్నంతా చేశారు. ఆఫ్ఘానిస్తాన్‌లోని కాబూల్ ఎయిర్ పో ర్టులో జ‌రిగిన బాంబు దాడిలో అమెరికా సైనికులు మృతి చెందిన త‌ర్వాత‌..ఆయ‌న తీవ్రంగా స్పందించా రు. ప్రతీకారం తీర్చుకుంటామ‌ని చెప్పారు. అనుకున్న‌ట్టుగానే.. అమెరికా ప్ర‌తీకారం తీర్చుకునే ప‌నిలో ప‌డింది. మ‌రి ఇప్పుడు ఏం జ‌రుగుతుంది? ఇదీ ఇప్పుడు ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌ర‌పెడుతున్న ప్ర‌శ్న‌.

``కాబుల్ విమానాశ్రయంలో జరిగిన పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులు హీరోలు. ఈ ఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టం. వారిని క్షమించం. వేటాడి మరీ.. ప్రతీకారం తీర్చుకుంటాం`` ఇదీ 24 గంట‌ల కింద‌ట అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ చేసిన ప్ర‌తిజ్ఞ‌. అనుకున్న‌ట్టుగానే ఆయ‌న రంగంలోకి దిగిపోయారు.

కాబుల్ విమానాశ్ర‌యంలో జ‌రిగిన బాంబు పేలుళ్ల ఘటనను అమెరికా తీవ్రంగా పరిగణించింది. పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులను హీరోలుగా అభివర్ణించారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్. ఉగ్రమూకలను వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. మృతిచెందిన వారికి సంఘీభావంగా.. బైడెన్ కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ వార్త పై ప్ర‌పంచ దేశాలు నిజ‌మా? అంటూ.. పెద‌వి విరిచాయి.

కానీ, అనుకున్న‌ట్టుగా బైడెన్ ప‌ని ప్రారంభించారు. కాబుల్ విమానాశ్రయం వద్ద ఐసిస్-కే జరిపిన జంట ఆత్మాహుతి పేలుళ్లకు అమెరికా ప్రతీకారం తీర్చుకుంటోంది. ఆఫ్ఘానిస్థాన్లోని ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడులు చేసింది. ఈ నేపథ్యంలో కాబుల్ విమానాశ్రయాన్ని ఖాళీ చేయాలని పౌరులను హెచ్చరించింది. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా ఐసిస్-కే వ్యూహకర్త లక్ష్యంగా ఈ నంగహార్ ప్రావిన్సులో ఈ వైమానిక దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ బిల్ అర్బన్ తెలిపారు.

తాము అనుకున్న లక్ష్యాన్ని అంతం చేసినట్లు చెప్పారు. ఈ ఘటనలో పౌరులెవరికీ హాని జరగలేదని పేర్కొన్నారు. కాబుల్ విమానాశ్రయం వద్ద గురువారం జరిగిన జంట పెలుళ్ల ఘటనలో 180మందికిపైగా మృతి చెందారు. వీరిలో 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటాడి చంపుతామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం 48 గంటల్లోనే ఐసిస్ స్థవరాలపై అమెరికా సైన్యం మానవరహిత డ్రోన్ దాడులు చేసింది. ఇంత వ‌ర‌కుబాగానే ఉన్నా.. అమెరికా సేన‌ల దాడితో తాలిబాన్లు మ‌రింత రెచ్చిపోతే.. ఏం టి ప‌రిస్థితి.. అనే విష‌యం ఇప్పుడు క‌ల‌వ‌ర పెడుతోంది. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.