Begin typing your search above and press return to search.

నడిరోడ్డు మీద కొట్టుకున్న బీజేపీ నేతలు

By:  Tupaki Desk   |   20 Dec 2020 9:00 PM IST
నడిరోడ్డు మీద కొట్టుకున్న బీజేపీ నేతలు
X
గ్రేటర్ గెలిచి జోరుమీదున్న బీజేపీలో ఆధిపత్య పోరు కూడా మొదలైంది. నేతలు గెలుపు ఉత్సాహంలో పార్టీలో పరపతి కోసం పాకులాడుతున్నారు. అది గొడవలకు కారణమైంది. తాజాగా తార్నాకలో బీజేపీ నేతలు నడిరోడ్డుపై కొట్టుకున్నారు. ఇది రచ్చ రచ్చ అయ్యింది.

సికింద్రాబాద్ బీజేపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయి చేరాయి. నడిరోడ్డు మీదే బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. తార్నాక డివిజన్ అధ్యక్షుడు రాముపై మరో బీజేపీ నేత శారదా మల్లేష్ దాడి చేశాడు. నేతలిద్దరూ రోడ్డుపైనే ఘర్షణకు దిగారు. ఒకరినొకరు దూషించుకుంటూ హంగామా చేశారు.

ఇటీవల జరిగిన తార్నాక డివిజన్ లాలాపేట్ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ వివాదానికి కారణమైంది. బీజేపీ కార్యకర్తల సమావేశంలో తార్నాక డివిజన్ అధ్యక్షుడు రాము ప్రోటోకాల్ ప్రకారం తనను స్టేజీకిపైకి ఆహ్వానించలేదనే కోపంతోనే శారదా మల్లేష్ ఆ దాడికి దిగినట్లు తెలుస్తోంది.

ఈ పంచాయితీ కాస్త బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఇంటికి చేరింది. ఇరువర్గాల కార్యకర్తలు భారీగా రామచంద్రరావు ఇంటికి చేరుకున్నారు.