Begin typing your search above and press return to search.

రాజేంద్రప్రసాద్ ను కలిసిన బీజేపీ అధ్యక్షుడు.. ఏంటి మ్యాటర్?

By:  Tupaki Desk   |   7 Dec 2020 5:03 PM IST
రాజేంద్రప్రసాద్ ను కలిసిన బీజేపీ అధ్యక్షుడు.. ఏంటి మ్యాటర్?
X
ఏపీలో రాజకీయం అనూహ్యంగా మారుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీర్రాజు వెంట నటి హేమ కూడా ఉండడం విశేషం.

ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని చూస్తున్న బీజేపీ ఇప్పుడు సినీ గ్లామర్ కోసం పరితపిస్తోంది. తాజాగా తెలంగాణలో బలమైన నాయకురాలు, సినీ నటి విజయశాంతి బీజేపీలో చేరడంతో ఈ ఊపు ఎక్కువైంది.

ఈ క్రమంలోనే ఏపీలోనూ నరుక్కువచ్చే పనిలో పడ్డారు సోము వీర్రాజు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు తాజాగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ను కలవడం చర్చనీయాంశమైంది. రాజేంద్రప్రసాద్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సోము వీర్రాజు కలిశారు. ఆయన వెంటన నటి హేమ కూడా రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి ఈ కలియకను దగ్గరుండి చేశారు.

అయితే రాజేంద్రప్రసాద్ ను మర్యాదపూర్వకంగానే కలిసినట్టు సోము వీర్రాజు చెబుతున్నారు. కానీ ఇందులో ఏదో మర్మం దాగి ఉందని అంటున్నారు. రాజేంద్రప్రసాద్ ను సోము వీర్రాజు కలవడం ఏపీలో బీజేపీకి సినీ గ్లామర్ అద్దడమా? లేక మరేదైనా ప్లాన్ ఉందా అన్నది తెలియాల్సి ఉంది.