Begin typing your search above and press return to search.

జీఎస్టీ పెంచాలన్న నిర్ణయానికి బ్రేక్

By:  Tupaki Desk   |   1 Jan 2022 8:32 AM GMT
జీఎస్టీ పెంచాలన్న నిర్ణయానికి బ్రేక్
X
కొత్త సంవత్సరం వేళ వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ విధించాలన్న కేంద్రప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకుంది. వస్త్రాలపై వడ్డించాలన్న కేంద్ర నిర్ణయానికి బ్రేక్ పడింది. టెక్స్ టైల్ పై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలనుకునే నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. టెక్స్ టైల్ జీఎస్టీ పెంపునకు సంబంధించి ఓ కమిటీ వేసింది.

ఈ కమిటీ నివేదికను కేంద్రమంత్రులందరికీ పంపనుంది జీఎస్టీ మండలి. కమిటీ నివేదికపై ఫిబ్రవరి లేదా మార్చిలో చర్చించాకే జీఎస్టీ పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.

ఢిల్లీలో నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 46వ సమావేశం జరిగింది. నేటి నుంచి టెక్స్ టైల్, చెప్పులపై జీఎస్టీ పెంపుపైనే చర్చ జరిగింది. కౌన్సిల్ సభ్యులందరూ టెక్స్ టైల్స్ పై జీఎస్టీ పెంచడం సరికాదంటూ తేల్చిచెప్పారు.

తెలంగాణ, ఏపీ సహా మెజిరాటీ రాష్ట్రాలు జీఎస్టీ పెంపును వ్యతిరేకించాయి. చేనేత మీద లక్షలాది మంది పేద ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారని వారిపై భారం మోపొద్దన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు జీఎస్టీ పెంపుపై విమర్శలు ఎక్కుపెట్టాయి. వస్త్ర వ్యాపారులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దీంతో టెక్స్ టైల్స్ పై జీఎస్టీ పెంపు నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఇవాళ్లి నుంచి అమలు చేయాల్సిన జీఎస్టీ పెంపు వాయిదా పడింది.