Begin typing your search above and press return to search.

నన్ను కేసీఆర్ ఫాలో అయ్యాడు.. చంద్రబాబు మళ్లీ ఏసాడు!

By:  Tupaki Desk   |   11 Nov 2022 4:56 AM GMT
నన్ను కేసీఆర్ ఫాలో అయ్యాడు.. చంద్రబాబు మళ్లీ ఏసాడు!
X
టీడీపీ అధినేత చంద్రబాబు మాట మాట్లాడితే చాలు హైదరాబాద్ కట్టింది నేనే.. సాఫ్ట్ వేర్ తెచ్చింది నేనే.. సత్య నాదెళ్లను ఐటీ వైపు పొమ్మన్నది నేనే అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఇంతలా అభివృద్ధి చెందడానికి తాను వేసిన పునాదులే కారణమంటాడు. తాజాగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 ఎదగడానికి తాను వేసిన పునాదినే కారణం అంటూ మరోసారి కేసీఆర్ క్రెడిట్ ను హైజాక్ చేశాడు చంద్రబాబు.

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా చంద్రబాబు చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. వెనుకబడిన తెలంగాణ తాను చేపట్టిన ఐటీ అనే ఒక్క నిర్ణయంతోనే ఇప్పుడు ఇంత అభివృద్ధి చెందిందన్నారు. టెక్నాలజీలో తెలుగువాళ్లు బాగా రాణిస్తున్నారని.. హైదరాబాద్లో ఐటీ కంపెనీలు వచ్చాయన్న ఆయన.. భాగ్యనగరంలో భూమి విలువ బాగా పెరిగిందన్నారు. ఇప్పుడు కేవలం రంగారెడ్డిలోనే 200 కళాశాలలు వచ్చాయన్నారు.

తెలంగాణలో వ్యవసాయం అభివృద్ధికి నేనే నాంది పలికానని చంద్రబాబు చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ ఐటీ అభివృద్ధికి నాంది పలికింది టీడీపీనేనన్నారు. వ్యవసాయం చేసే రైతు బిడ్డ.. నాగలితోపాటు మౌస్ పట్టుకోవాలని ఆరోజే చెప్పానని.. అందుకే తెలంగాణ ఇంత డెవలప్ అయ్యిందన్నారు.

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్రం రూపురేఖలు మారాయి. అప్పటివరకూ చీకట్లో ఉండే తెలంగాణ ప్రజలకు 24 గంటలు కరెంట్ వచ్చేలా చేశాడు కేసీఆర్. ఇక ఐటీని మంత్రి కేటీఆర్ కృషి చేసి ఎన్నో కంపెనీలు చేశాడు. కాళేశ్వరంతో సాగునీరు, భగీరథతో తాగునీటిని కేసీఆర్ తెచ్చాడు. రైతు బంధుతో రైతుల పాలిట కేసీఆర్ ఆపద్భాంధవుడు అయ్యాడు.

ఇవన్నీ కేసీఆర్ ఈ 8 ఏళ్లలో చేసి తెలంగాణను డెవలప్ చేస్తే చంద్రబాబు మాత్రం మొత్తం క్రిడెట్ ను తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం. మరి బాబు కామెంట్లకు టీఆర్ఎస్ నేతలు ఏమైనా కౌంటర్ఇస్తారా? పెద్దమనిషి అని ఆయన చాదస్తానికి ఆయనను వదిలేస్తారా? అన్నది వేచిచూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.